కశ్మీర్‌లో భారత్‌ చర్యలను స్వాగతిస్తున్నాం

కశ్మీర్‌ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత్‌ చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. కశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వీటిని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌  స్పందిస్తూ..

Updated : 04 Mar 2021 15:24 IST

 ప్రకటించిన అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: కశ్మీర్‌ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత్‌ చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. కశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వీటిని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌  స్పందిస్తూ.. భారత చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇవి భారత ప్రజాస్వామ్య విలువలను స్థిరపరుస్తాయని తెలిపారు.  అదే సమయంలో అక్కడ జరిగే పరిణామాలను గమనిస్తున్నామని పేర్కొన్నారు.  కశ్మీర్‌ విషయంలో అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ క్వాడ్‌పై పలుమార్లు భారత విదేశాంగ మంత్రితో మాట్లాడారని ప్రైస్‌ తెలిపారు.

ఇక భారత్‌తో సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ప్రైస్‌ వివరించారు. అదే సమయంలో పాక్‌తో కూడా  కలిసి ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేస్తామని ప్రైస్‌ వెల్లడించారు. భారత్-పాక్‌ మధ్య జరిగే చర్చలకు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలు చల్లారి పరిస్థితులు అదుపులోకి రావాలని తాము కోరుకుంటున్నామని నెడ్‌ప్రైస్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని