Afghan Crisis: తాలిబన్లతో డీల్ ట్రంప్ది.. ఫినిషింగ్ బైడెన్ది!
అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట అరాచక పాలనే మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో.......
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట ఉన్న అరాచక పాలనలో మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు. బతుకు జీవుడా.. అంటూ తమ దేశం వదిలి పారిపోతున్న దృశ్యాలు ప్రపంచ దేశాలను కలిచివేస్తున్నాయి. అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే తాలిబన్ ఫైటర్లు మెరుపు దాడులతో కాబుల్ను వశపరచుకోవడంతో ఇలాంటి భీతావహ వాతావరణం నెలకొందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్లతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని అమలుచేయడమే ఇందుకు కారణం. అయితే, 20 ఏళ్ల కాలంలో అమెరికా సైన్యం చేతిలో శిక్షణ పొందిన అఫ్గాన్ సైన్యం ఎందుకు తాలిబన్ ఫైటర్లను ఎదుర్కోలేకపోయింది? అగ్రరాజ్యం అండదండలు ఉన్నా అఫ్గన్ ప్రభుత్వం తాలిబన్ ఫైటర్ల ముందు ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ ఒప్పందం?
అఫ్గాన్లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య గతేడాది ఫిబ్రవరిలో ఖతార్ రాజధాని దోహా వేదికగా చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. 135 రోజుల్లోపు అమెరికా మిత్ర దేశాలు తమ సేనల సంఖ్యను 8600లకు తగ్గించుకోవాలి. అలాగే, 14 నెలల్లోపు మొత్తం బలగాలను ఉపసంహరించుకొనేలా ఒప్పందం కుదిరింది. వేలాది మంది ఖైదీల అప్పగింతకు కూడా ఇరు దేశాలూ పరస్పరం అంగీకరించడంతో పాటు ఇరు ప్రతినిధులూ సంతకాలు చేశారు. అప్పడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియో పర్యవేక్షణలో తాలిబన్లతో ఈ ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా అల్ఖైదాతో తాలిబన్లు పూర్తిగా సంబంధాలను తెంచుకోవాలని కూడా అమెరికా షరతు విధించింది. అయితే, ఈ ఒప్పందంలో అఫ్గన్ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకుండా ఏకపక్షంగా సాగడం ఆందోళనకర పరిణామం. ఒప్పందంలో భాగంగా తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయబోమని హమీ ఇవ్వడంతో తాలిబన్లకు తిరిగి ఊపిరి వచ్చినట్టయింది. ఈ ఒప్పందం అమలవుతున్న తరుణంలో చోటుచేసుకున్న పరిణామాలు తాలిబన్లను మరింత బలోపేతం చేశాయి. వైమానిక దాడులు నిలిచిపోవడంతో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉన్న తాలిబన్ ఫైటర్లు, సానుభూతిపరుల పునరేకీకరణ జరిగింది. దీంతో పుంజుకొని అఫ్గాన్ ప్రజా ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన తాలిబన్లు ఎవరి ఊహలకు అందనంతగా మెరుపు వేగంతో కాబుల్ను ఆక్రమించి తమ జెండా పాతేశారు.
అఫ్గాన్ సైన్యం ఎందుకు మోకరిల్లింది?
అమెరికా సాయంగా సమకూర్చిన ఆయుధాలు, నిధులతో రెండు దశాబ్దాలుగా అఫ్గాన్ సైన్యం ఎంతో రాటుతేలిందని భావించినా అదంతా వృథాగానే మిగిలిపోయింది. ఆ సైన్యం తాలిబన్ ఫైటర్లను దీటుగా ఎదుర్కోలేకపోయింది. కొందరు సైనికులు అవినీతికి అలవాటుపడిపోవడం, తాలిబన్లకు పావులుగా మారడంతో ఈ సంక్షోభ సమయంలో దీటుగా ఎదుర్కోలేక చతికిలపడిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అఫ్గాన్ అధ్యక్షుడిగా కొనసాగిన అష్రఫ్ ఘనీ కూడా తక్కువేం తినలేదు. ఆయన దేశంలోని ఉత్తర ప్రాంతంలో బలీయశక్తిగా ఉన్న నార్తర్న్ అలయన్స్ (ఉత్తర కూటమి)ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో 2001లో అమెరికాకు సహకరించిన ఉత్తరకూటమి ప్రస్తుతం పోరాడే సత్తా లేక పూర్తిగా చతికిలపడింది. ఇరాక్లోనూ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినా ఆ దేశ సైన్యం తిరిగి పుంజుకోవడంతో ఐసిస్పై విజయం సాధించింది. అయితే అఫ్గాన్ సేనలో అంకితభావం, పోరాట పటిమ, దేశభక్తి లేకపోవడం.. తదితర కారణాలతో ఒక్క తూటా కాల్చకుండానే తాలిబాన్లకు లొంగిపోయింది.
విమర్శల్ని తిప్పికొట్టిన అమెరికా
మరోవైపు, అఫ్గాన్ విషయంలో బైడెన్ విఫలమయ్యారన్న విమర్శల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అఫ్గాన్ సేనల చేతకానితనమే తాలిబన్ల ఆధిపత్యానికి కారణమైందని అగ్రరాజ్యం జాతీయ భద్రత సలహాదారు జేక్ సూల్లివన్ పేర్కొన్నారు. అఫ్గాన్లో రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాన్ని మూడో దశాబ్దంలోనూ చూడాలని బైడెన్ భావించలేదన్నారు. ఇన్నేళ్లుగా అఫ్గాన్ సేనలకు శిక్షణ, వందల కోట్ల డాలర్ల నిధులు అందించిన తర్వాత ప్రభుత్వ సైన్యమే తమ దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని బైడెన్ భావించారన్నారు. అందుకే అమెరికా దళాల ఉపసంహరణ నిర్ణయానికి బైడెన్ కట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ పరిస్థితికి బైడెనే కారణమని ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైఫల్యమన్నారు. బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అధికారంలో ఉండి తాను విదేశాంగ మంత్రిగా ఉంటే తాలిబన్లకు అమెరికా గుణపాఠం నేర్పిఉండేదని పాంపియో వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్