‘కరోనాని ఓడించడం మన చేతుల్లోనే..!’
కరోనా సెకండ్ వేవ్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు,....
కొవిడ్ని జయిద్దాం.. భారత్ను గెలిపిద్దాం!
ఇంటర్నెట్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ భారత్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ వైరస్ వాయు వేగంతో వ్యాపిస్తుండటంతో భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో ఎన్నడూలేనంతగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్పత్రుల్లో పడకల్లేవ్.. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవు.. చివరకు శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలకు సైతం చోటు దొరకని దుస్థితి అందరినీ కలచివేస్తోంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితులను సృష్టించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు, ఆరోగ్యరంగ నిపుణులు. అప్రమత్తతతో తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్పై పోరాటంలో జయం మనదేనంటున్నారు.
మాస్క్ మరవకండి
కరోనాపై పోరాటంలో మాస్క్ ధరించడమే తొలి అస్త్రం. కరోనా అలజడి మొదలైనప్పట్నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి లోపించడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజలు రోజంతా మాస్క్లు పెట్టుకొని ఉండటం ద్వారా కరోనా వైరస్ గొలుసును కొన్ని వారాల్లోనే ఛేదించవచ్చని ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు. సెకండ్ వేవ్లో కొవిడ్ విజృంభణ దృష్ట్యా ఇంట్లో ఉన్నా సరే ప్రజలు మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడినవారిలో ఎక్కువ మందిలో లక్షణాలు బయటపడకపోవడం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ద్వారానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించదు. డబుల్ మాస్క్ ధరించడం మరింత మేలు చేస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. సర్జికల్ మాస్క్, దానిపైన వస్త్రంతో తయారుచేసిన మాస్క్ను ధరించడం వల్ల కరోనాను సమర్థంగా ఎదుర్కోవచ్చని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. కరోనాకు బ్రేకులు వేయడంలో మాస్కే శ్రీరామ రక్ష అని నిపుణులు పేర్కొంటున్నారు.
టెస్ట్.. టెస్ట్..టెస్ట్.. ప్లీజ్!
కొవిడ్ అనుమానిత లక్షణాలు కనబడగానే వెంటనే టెస్ట్లు చేయించుకోవడంలో వెనకాడొద్దు. ఆలస్యం చేస్తే రిస్క్లో పడినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోనడం ద్వారానే ఈ వైరస్ ముప్పు నుంచి బయట పడొచ్చంటున్నారు. కరోనాను గుర్తించి దాని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టింగే ఏకైక మార్గమని నిపుణులంతా చెబుతున్నమాట. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం ద్వారా వైరస్ను కట్టడిచేసే వ్యూహాలు అమలు చేయడం మరింత తేలికవుతుంది. అంతేకాదు.. కరోనా తీవ్ర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్తున్న రోగులను అడ్మిట్ చేసుకొనే ముందు కొవిడ్ రిపోర్టులు అడుగుతున్నారు. అప్పటికే టెస్ట్లు చేయించుకోకపోవడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోవాల్సిన కీలక సమయం వృథా అవుతోంది. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలూ ఉన్నాయి. అందువల్ల అనుమానం వస్తే టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమం. కొవిడ్ టెస్ట్ ఫలితం కోసం వేచి చూడకుండా ఐసోలేట్ కావాలి.
స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలే లేని వారు సైతం పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వైరస్ బారిన పడకుండా మేలుచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ సంఖ్యలో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నాయి. మరోవైపు, దేశంలో కొవిడ్ టెస్టులు పెద్ద సమస్యగా మారింది. రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో టెస్టింగ్ కిట్లతో పాటు శాంపిల్స్ సేకరించే సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వేధిస్తుండటంతో మరింత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శాంపిల్ సేకరించే కేంద్రాల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కొవిడ్ టెస్ట్ రిపోర్టు రావాలంటేనే కొన్ని రోజుల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటిచోట్ల కూడా ఇంటికి వెళ్లి స్వాబ్ సేకరించడం కష్టతరంగా మారింది.
వ్యాక్సినే బ్రహ్మాస్త్రం..
కరోనాపై యుద్ధంలో టీకాయే బ్రహ్మాస్త్రం. టీకా వేసుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని ఇప్పటికే అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా వేసుకున్న తర్వాత కరోనా పాజిటివ్గా వస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటోంది. అందుకే వైద్యరంగ నిపుణులతో పాటు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున టీకాలు వేయించుకోవాలని ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదనే భరోసా లేనప్పటికీ ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు మాత్రం తక్కువ. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల స్పుత్నిక్ వీ టీకాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంకా పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఈ రెండూ కరోనా తీవ్రత నుంచి కాపాడటంలో సమర్థంగా పని చేస్తున్నాయి.
రోగనిరోధక శక్తి పెంచుకోండి
మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు శరీరానికి తగిన పోషకాహారాన్ని తీసుకోవడం ఈ సమయంలో ఎంతో ముఖ్యం. రోగనిరోధక శక్తిని ఇనుమడింప జేసుకోవడం ద్వారా కరోనా బారినుంచి కొంత వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, మాంసం వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అనుసరించడం మేలు చేస్తాయి. ఈ క్లిష్ట సమయంలో ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ,బి,సి,డి,ఈ, జింక్ వంటి విటమిన్లు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్ ముప్పును తగ్గించుకోవచ్చు.
అత్యవసరమైతే తప్ప బయటకెళ్లొద్దు..
కరోనా విలయంతో హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక మనిషి మరో మనిషి దగ్గరకు వెళ్లాలంటేనే అనుమానం వెంటాడుతోంది. అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు వెళ్లొద్దు. పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలు, ఇతర వేడుకలకు దూరంగా ఉండండి. మీ స్నేహితులు, బంధువుల బాగోగులను ఫోన్లో తెలుసుకోండి. భయంతో వణుకుతూ బంధాల్ని దూరం చేసుకోవద్దు. మార్కెట్కు వెళ్లిన సమయంలో డబుల్ మాస్క్ పెట్టుకొని వెళ్లండి. ఇంటికి వచ్చాక కూరగాయలను శుభ్రంగా కడిగి వాడండి. ఇంటికి అవసరమయ్యే సరకుల కోసం ప్రతిసారీ తిరగే అవకాశం లేకుండా 15 రోజులు/ నెలకు సరిపడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఈ సంక్షోభ సమయంలో కొన్నాళ్ల పాటు ఇలాంటి ముందు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారిపై విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా