Subrata Mukherjee: బెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత

తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమబెంగాల్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో......

Published : 05 Nov 2021 07:36 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పశ్చిమబెంగాల్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే దీదీ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. సుబ్రతా ముఖర్జీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్రతా ముఖర్జీ ఇక లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన నేత అని కొనియాడారు. సుబ్రతా ముఖర్జీ మరణం తనకు వ్యక్తిగతం ఎంతో నష్టమని తెలిపారు. ఆయనలేని లోటు పూడ్చలేనిదన్నారు. గత వారంలో తీవ్రమైన శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో సుబ్రతా ముఖర్జీని ఐసీయూలోకి తరలించి చికిత్స అందించినట్టు వైద్య సిబ్బంది వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని