metaverse: ఫేస్బుక్ ‘మెటా’గా ఎందుకు మారింది..?
మనం సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే భూమీ ఆకాశం ఒక చోట ఏకమైనట్లు ఉంటుంది.. అది కేవలం మన కళ్లు చేసే మాయే.. ఫేస్బుక్ పేరును కొత్తగా ‘మెటా’ సంస్థగామార్చింది.
నవలోకం దిశగా సోషల్ మీడియా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
మనం సముద్రం ఒడ్డున నిలబడి చూస్తే భూమి, ఆకాశం ఒక చోట ఏకమైనట్లు ఉంటుంది.. అది కేవలం మన కళ్లు చేసే మాయే.. మెటావర్స్ కూడా అటువంటి సాంకేతికతే. ఫేస్బుక్ తన మాతృ సంస్థ పేరును కొత్తగా ‘మెటా’గా మార్చింది. ఇదే భవిష్యత్తని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ పేర్కొన్నారు. మెటా-వర్స్ అనే పదాలను కలిపి దీనిని సృష్టించారు. 1992లో నీల్ స్టీఫెన్సన్ రచించిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ నవల స్నోక్రాష్ దీనిని బాగా ప్రచారంలోకి తెచ్చింది. సైన్స్ కల్పనల్లో వర్చువల్ రియాల్టీని ఉపయోగించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి దీనిని వాడతారు. దీని ద్వారా 2డీలో ఉన్న ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచం 3డీలోకి మారుతుంది.
టెక్నాలజీ పూర్తిగా అభివృద్ధి చెందిందా..?
ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. సైన్స్ ఫిక్షన్ నవలలు, సినిమాల్లో అభివర్ణించినట్లు పూర్తిగా కృత్రిమ ప్రపంచం స్థాయిలో ఇది ఉండదు. ప్రజలు వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని ఉపయోగించి తమ కృత్రిమ క్యారెక్టర్లను సృష్టించి డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సరళంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం డిజిటల్ స్క్రీన్పై 2డీ విధానంలో చూస్తున్నాం. కానీ, మెటావర్స్లో వీఆర్ టెక్నాలజీ హెడ్సెట్స్ వాడి డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన భావన పొందవచ్చు. ఇందుకోసం వర్చువల్ రియాల్టీ హెడ్సెట్స్, అగ్మెంటెడ్ రియాల్టీ గ్లాసులు, స్మార్ట్ఫోన్ యాప్స్, ఇతర పరికరాలు వాడాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి కనీసం 15ఏళ్లు పట్టవచ్చని అంచనా. ఉదాహరణకు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో వర్క్ఫ్రం హోం ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. వీడియో కాల్లో సహోద్యోగులతో సంభాషిస్తున్నాం. కానీ, మెటావర్స్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు వర్చువల్ కార్యాలయంలో పనిచేసే అవకాశం ఉందని ఎన్పీఆర్.ఓఆర్జీ పేర్కొంది.
2000 సంవత్సరంలో లిండెన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ ‘సెకండ్ లైఫ్’ పేరిట ఓ గేమ్ను పరిచయం చేసింది. ఆన్లైన్లో మనం ఇళ్లు నిర్మించుకోవడం, ఆడుకోవడం, మాట్లాడుకోవడం, దుస్తులు కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చు. కానీ, స్మార్ట్ఫోన్ల రాకతో దీనికి కాలక్రమంలో ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోయింది.
లక్ష్యం ఏమిటీ..?
ఫేస్బుక్ అనుకున్న స్థాయిలో ఇది పూర్తిగా ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా తెలియదు. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఐరోపాలో 10,000 మంది ఉద్యోగులను నియమించుకొంది. మెటావర్స్ అభివృద్ధిలో భాగంగా 2021 లాభాల్లో 10 బిలియన్ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని ఫేస్బుక్ పేర్కొంది.
కొత్త మెటావర్స్ వ్యాపారం ఎప్పటికి లాభాల్లోకి వెళుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వచ్చే పదేళ్లలో మాత్రం ఇది 100 కోట్ల మందికి చేరువవుతుందని చెబుతున్నారు. వందల కోట్ల డాలర్ల డిజిటల్ వాణిజ్యంతో పాటు.. క్రియేటర్లు, డెవలపర్ల రూపంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించనుంది.
వాస్తవానికి ఫేస్బుక్ మెటావర్స్ యాడ్ వ్యాపారంపై జుకర్బర్గ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, ఫేస్బుక్ మెటావర్స్ కోసం బయటివారు కూడా గేమ్స్, కాన్సెర్ట్స్, ఇతర ఉత్పత్తులను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. మెటావర్స్లోని డిజిటల్ ప్రపంచంలో యాడ్స్ ప్రదర్శన ద్వారా ఫేస్బుక్ నిధులు సంపాదించే అవకాశం ఉంది. అంతేకాదు మెటావర్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేసరికి దానిలో ప్రత్యేకమైన యాప్స్టోర్ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఫార్చ్యూన్ పత్రిక పేర్కొంది.
దీనిపై ఫేస్బుక్ ఒక్కటే పనిచేస్తోందా..?
చాలా కంపెనీలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. వీటిల్లో ఫేస్బుక్ ఒకటి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చిప్ మేకర్ న్విడియా ఇప్పటికే వీటిపై పని మొదలుపెట్టాయి. ‘‘చాలా కంపెనీలు వాటి వాటి కృత్రిమ డిజిటల్ ప్రపంచాలను సృష్టిస్తాయని అనుకుంటున్నాం. ప్రస్తుతం ‘వరల్డ్ వైడ్ వెబ్’లో కంపెనీలు రకరకాల అద్భుతాలు ఎలా సృష్టిస్తున్నాయో అదే విధంగా మెటావర్స్లో కూడా చేయవచ్చు’’ అని న్విడియా ఓమ్నివెర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ కెర్రిస్ పేర్కొన్నారు.
ఇక వీడియో గేమింగ్ కంపెనీలు కూడా ఈ రేసులో ఉన్నాయి. చాలా పాపులర్ వీడియో గేమ్ ‘ఫోర్ట్నైట్’ తయారీ దారు ఎపిక్ గేమ్స్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి బిలియన్ డాలర్లను సమీకరించింది. ప్రముఖ గేమింగ్ ప్లాట్ ఫామ్ రాబ్లాక్స్ కూడా దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రముఖ బ్రాండ్స్ కూడా తమ ఉత్పత్తుల విక్రయానికి మెటావర్స్ను వేదికగా చేసుకొనే అవకాశం ఉంది. ఫ్యాషన్ దిగ్గజం గూచీ బ్రాండ్ తమ ఉత్పత్తుల విక్రయ వేదిక కోసం రాబ్లాక్స్తో కలిసి పనిచేస్తోంది. కోకా కోలా, క్లినిక్ సంస్థలు కూడా ఉన్నాయి.
వినియోగదారుడికి మరింత డేటా భారం..?
ఫేస్బుక్ ప్రస్తుతం వ్యాపార మోడల్ వలే వినియోగదారుల ఇంటర్నెట్ డేటాను వాడుకుని వాణిజ్య ప్రకటనల విక్రయం చేపట్టే అవకాశం ఉంది. అంటే.. 3డీ ప్రపంచంలోకి వెళ్లేందుకు మన డేటాను ఫేస్బుక్ వాడుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
అరవింద్ కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, అతనికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్ను కోర్టు ఆదేశించింది. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పులకు వాడిన తుపాకీ కోసం సూరత్లోని తపతీ నదిలో గాలింపు చేపట్టారు. -
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. -
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ చేయొచ్చు
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన జియో.. నికర లాభం ₹5,337 కోట్లు
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్