Poonch encounter: ఈ దుర్మార్గుడు జియా ముస్తఫా ఎవరో తెలుసా..?
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఆదివారం ఓ ఊహించని ఘటన చోటు చేసుకొంది. కరుడుగట్టిన ఉగ్రవాది జియా ముస్తఫా ఆ
పూంచ్ ఎన్కౌంటర్లో హతమైన ‘నదీమార్గ్’ నరమేధం సూత్రధారి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఆదివారం ఓ ఊహించని ఘటన చోటు చేసుకొంది. కరుడుగట్టిన ఉగ్రవాది జియా ముస్తఫా ఆ ఎన్కౌంటర్లో మరణించాడు. ముష్కరుల స్థావరాలను గుర్తించేందుకు జైల్లో ఉన్న జియాను భద్రతా దళాలు అడవుల్లోకి తీసుకెళ్లాయి. దళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భారీఎత్తున కాల్పులు జరపడంతో కొందరు జవాన్లతో పాటు జియా కూడా గాయపడ్డాడు. అతడిని ఆ ప్రదేశం నుంచి బయటకు తేవడానికి దళాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఘటనాస్థలంలోనే జియా మరణించాడు. సోమవారం 15 రోజు కూడా మెందహార్ అడవుల్లో భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి.
శనివారమే పోలీస్ రిమాండ్కు..
2003లో అరెస్టైన జియా ముస్తఫా తొలుత శ్రీనగర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కానీ, 2018లో నవీద్ జాట్ అనే ఉగ్రవాది ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రి నుంచి పరారవడంతో జియాను జమ్మూలోని కోట్ బాల్వాల్ జైలుకు తరలించారు. తోటి ఖైదీలను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో తిహార్ జైలుకు పంపించాలనుకున్నారు. కానీ, అది జరగలేదు. దీంతో కోట్ బాల్వాల్ జైల్లోనే ఉండిపోయాడు. అక్కడి నుంచి పాకిస్థాన్లోని లష్కరే ఉగ్రవాదులతో ‘టచ్’లో ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం మెందహార్ పోలీసులు 10 రోజుల రిమాండ్లోకి తీసుకొన్నారు. ఆదివారం అతన్ని బాతా దురియా వద్ద ఎన్కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల దాడిలో జియా మరణించాడు. అతికష్టం మీద ముస్తఫా మృతదేహాన్ని దళాలు స్వాధీనం చేసుకొన్నాయి.
ఉగ్రవాదుల్లో పెద్దచేప..!
2001లో నియంత్రణ రేఖను దాటి కశ్మీర్లో ప్రవేశించిన జియా ముస్తఫా చిన్నా.. చితకా ఉగ్రవాది కాదు. 24 మంది కశ్మీరీ పండిట్ల ప్రాణాలను బలిగొన్న ‘నదీమార్గ్’ నరమేధానికి సూత్రధారి. 2003 ఏప్రిల్ 10వ తేదీన ముస్తఫా అరెస్టును నాటి కశ్మీర్ డీజీపీ ఏకే సూరీ శ్రీనగర్లో ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇదో పెద్ద విజయంగా అప్పట్లో పేర్కొన్నారు. ముస్తఫా.. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో జిల్లా కమాండర్గా పనిచేశాడు. పాక్లోని లష్కరే నాయకత్వం ఆదేశాల మేరకే తాను నరమేధానికి పాల్పడినట్లు జియా విచారణలో వెల్లడించాడు. 2003 ఏప్రిల్ చివర్లో జియా ఇచ్చిన సమాచారం ఆధారంగా యారీపోరాలోని ఒక ఇంటిపై భద్రతా దళాలు దాడిచేసి అబు రఫీ, అబు వసీం, అబు బిలాల్ అనే ముగ్గురు పాక్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశాయి. వీరు ముగ్గరు కూడా నదీమార్గ్ నరమేధంలో పాల్గొన్నారు.
ఏమిటీ ‘నదీమార్గ్ నరమేధం’..?
1990ల్లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరగడంతో ‘నదీమార్గ్’ గ్రామంలోని చాలా మంది ఇళ్లు వదిలి జమ్మూ సహా ఇతర ప్రాంతాలకు వలసపోయారు. కానీ, 50 కుటుంబాలు మాత్రం ధైర్యంగా ‘నదీమార్గ్’లోనే ఉన్నాయి. ఈ గ్రామానికి తొమ్మిది మంది పోలీసులతో పికెట్ కూడా ఉంది. కానీ, 2003 మార్చి 23వ తేదీన ముగ్గరు పోలీసులు రాలేదు. ఆ రోజు రాత్రి దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గ్రామానికి వచ్చారు. వీరు తొలుత పోలీస్ పికెట్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతుండటంతో వారి ఆయుధాలను తీసుకొని వారిని బంధించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కశ్మీరీ పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. మృతుల్లో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పలు దేశాలు ఈ దాడిని ఖండించాయి. నిందితులకు శిక్షపడేందుకు అవసరమైన సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.
శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో..!
2003 సంవత్సరంలో భారత్-పాక్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారత్-పాక్లు తెరవెనుక చర్చలను మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొనే అవకాశాలు మెరుగుపడుతున్నప్పుడు నదీమార్గ్ ఘటన చోటు చేసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!