Wuhan: వుహాన్పై ‘డ్రాస్టిక్’ చెప్పిన విషయాలు..!
వుహాన్ ల్యాబ్ లీకు విషయంలో ఒక ఓపెన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు
22,000 వైరస్ నమూనాల సమాచారం మాయం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
వుహాన్ ల్యాబ్ లీకు విషయంలో ఒక ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్రూప్ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఉత్సాహవంతులు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. డ్రాస్టిక్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ గ్రూపు.. వుహాన్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, పత్రాలను బహిర్గతం చేస్తోంది. దీనిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. వుహాన్ ల్యాబ్ వైరస్ డేటా బేస్ను కొవిడ్ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు ఆన్లైన్ నుంచి తొలగించడాన్ని ఈ గ్రూప్ ప్రశ్నిస్తోంది.
హ్యాకర్ల ముప్పుగా చెబుతున్న చైనా..
2019లో కరోనావైరస్ సమాచారాన్ని ఆన్లైన్ నుంచి చైనా తొలగించింది. దీనిలో 22,000 వైరస్ నమూనాల సమాచారం ఉంది. వీటి జన్యుక్రమాల వివరాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం వెళ్లినప్పుడు.. చైనా శాస్త్రవేత్త షీజింగ్ లీని ఈ అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దానికి ఆమె.. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉండటంతో ఆ సమాచారం కోసం హ్యాకర్లు యత్నాలు చేస్తున్నారనీ.. ఆ కారణంగా ఆన్లైన్ నుంచి ఆ డేటాను తొలగించినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ డేటాను 2019లో సెప్టెంబర్లో తొలగించారు. అంటే వైరస్ వ్యాప్తి బాహ్యప్రపంచానికి తెలియడానికి దాదాపు మూడు నెలల ముందన్నమాట. అప్పుడు కొవిడ్19 గురించి ప్రపంచానికి తెలియదు కదా..? హ్యాకర్లు ఆ సమాచారం కోసం ఎందుకు ప్రయత్నిస్తారు..? లేకపోతే సెప్టెంబర్లోనే షీజింగ్ లీకు వైరస్ వ్యాప్తి విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే కొవిడ్-19 చైనా చెబుతున్నట్లు డిసెంబర్లో మొదలు కాలేదని దాని జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2018లో అమెరికా ఆందోళన..
వుహాన్ పేరుకు మాత్రమే పీ-4 స్థాయి ప్రయోగశాల. అక్కడ కనీసం భద్రతా చర్యలు కూడా తీసుకోరనే ఆరోపణలు గతం నుంచే ఉన్నాయి. ఆ ల్యాబ్ను అమెరికాకు చెందిన కొందరు అధికారులు 2018లో సందర్శించారు. ఈ క్రమంలో వారు అక్కడి భద్రతా ప్రమాణాల్లో లోపాలను గుర్తించారు. అక్కడ పనిచేసే వారికి కూడా ప్రొటోకాల్స్ పాటించే విషయంలో సరైన శిక్షణ లేదని గమనించారు. ఆ ల్యాబ్లో వైరస్లను భద్రపర్చే రిఫ్రిజిరేటర్ దెబ్బతిన్న చిత్రాన్ని గతేడాది పశ్చిమ దేశాల పత్రికలు ప్రచురించాయి.
చైనా సైనిక కార్యకలాపాలు..
వుహాన్ ల్యాబ్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జోక్యం ఎక్కువగానే ఉందని గతేడాది ‘ఎపోక్టైమ్స్’ పత్రిక కథనం పేర్కొంది. దాని ప్రకారం.. 2002లో సార్స్ వ్యాపించడంతో.. భవిష్యత్తులో ఇటువంటి వైరస్లను అడ్డుకోవడానికి పీ4ల్యాబ్ నిర్మించేందుకు సాయం చేయాలని ఫ్రాన్స్ను ‘ది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ కోరింది. దీనికి నాటి ఫ్రాన్స్ ప్రధాని రాఫారిన్ అంగీకరించారు. దీనికి ఫ్రాన్స్కు చెందిన ఆర్టీవీ అనే సంస్థ ఇంజినీరింగ్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, దానిని తొలగించి చైనా సైన్యంతో సంబంధాలున్న ఐపీపీఆర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నుంచి అక్కడ బయోకెమికల్ ఆయుధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని ఫ్రాన్స్ అనుమానిస్తోందని ఈ కథనం పేర్కొంది.
వైరస్ లీకవ్వగానే సైన్యం రంగ ప్రవేశం..
వుహాన్లో కరోనావైరస్ వ్యాపించిన సమయంలో జంతువుల నుంచి వచ్చిన అంటు రోగంగా ప్రచారం జరుగుతున్న సమయంలో వుహాన్ ల్యాబ్ నిర్వహణను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి తీసుకొంది. జనవరి 2వ తేదీనే వుహాన్లో వ్యాపించిన గుర్తుతెలియని నిమోనియా గురించిన వివరాలు ఎక్కడా మాట్లాడకూడదని ల్యాబ్ డీజీ నుంచి అందరికీ ఆదేశాలు వెళ్లాయి. పైగా దానికి సంబంధించిన పరిశోధన పత్రాలు ప్రచురించవద్దని పేర్కొన్నారు. పక్షం రోజుల తర్వాత ఆ ల్యాబ్ పగ్గాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బయోకెమికల్ నిపుణురాలు చెన్ వుయ్ చేతికి ఇచ్చారు. ఆ తర్వాత వారం రోజులకే చైనాలో బయో సెక్యూరిటీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అధ్యక్షుడు షీజిన్పింగ్ ప్రకటించారు. అక్కడి వైరస్ నమూనాల మొత్తాన్ని సీల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ పనిచేసిన ఒక మహిళా ఉద్యోగి వివరాలను ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నుంచి తొలగించారు. ఆమె తొలి పేషెంట్ అనే అనుమానాలు ఉన్నట్లు నాటి ‘ఎపోక్ టైమ్స్’ కథనంలో పేర్కొంది. ఇక వైరస్ వ్యాప్తి విషయాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ వంటి వారిని చైనా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. వాస్తవానికి నికార్సైన దర్యాప్తు జరిగి వాస్తవాలు తెలిసేవరకూ వుహాన్ ల్యాబ్పై అనుమానపు మేఘాలు కమ్ముకునే ఉంటాయి. మరోపక్క చైనా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తునకు అనుమతి ఇవ్వకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు