రాముడి భూమిపై పెట్రోల్ ధరలు తగ్గేదెన్నడు?
దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై బుధవారం పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రామాయణ ఇతిహాసాన్ని చర్చలో ప్రస్తావించారు.
దిల్లీ: దేశంలోని పెట్రోల్, డీజిల్ ధరల అంశంపై బుధవారం పార్లమెంటులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఇంధన ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రామాయణ ఇతిహాసాన్ని చర్చలో ప్రస్తావించారు. మనదేశంలోని పెట్రోల్ ధరలకు, పొరుగున ఉన్న సీతాదేవి జన్మస్థలం నేపాల్, రావణుడి శ్రీలంకలోని ధరలకు వ్యత్యాసాన్ని పోల్చుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
సమాజ్వాదీ పార్టీకి చెందిన విశంభర్ ప్రసాద్ నిషాద్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు మనదేశంతో పోలిస్తే.. సీతాదేవి జన్మస్థలం నేపాల్లో, రావణుడి లంకలో ఎందుకు తక్కువగా ఉన్నాయి. మరి రాముడి భూమిపై ప్రభుత్వం ఎప్పుడు పెట్రోల్ ధరలు తగ్గిస్తుంది’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈయన ప్రశ్నించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఆయన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ.. ఏదైనా అంశాన్ని ఇలా ఇతరులతో పోల్చడం సరికాదని సూచించారు. ఆయా దేశాల్లో పెట్రోల్, డీజిల్ తక్కువ మంది ఉపయోగిస్తారు.. కాబట్టి వినియోగానికి అనుగుణంగానే ఆయా దేశాల్లో వాటి ధరలు తక్కువగానే ఉంటాయన్నారు. అయినా మనల్ని మనం పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకోవాలా.. లేక చిన్న వాటితోనా? అని ఎదురు ప్రశ్న వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల నిర్ణయం అంతర్జాతీయ మెకానిజంపై ఆధారపడి ఉంటుందని బదులిచ్చారు. ‘మనదేశంలో కిరోసిన్ ధరలను ఇతర దేశాలతో పోల్చితే చాలా వ్యత్యాసం ఉంటుంది. బంగ్లాదేశ్, నేపాల్లో కిరోసిన్ రూ.57 లేదా రూ.59 ఉంటుంది. మరి భారత్లో కిరోసిన్ ధర రూ.32 మాత్రమే’ అని ప్రధాన్ ఉదహరించారు.
కాగా దేశంలో ఇంధన ధరలు బుధవారం మరోసారి పెరిగిన విషయం తెలిసిందే. వరుసగా రెండోరోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకడంతో.. పెట్రోల్పై 30పైసలు, డీజిల్పై 25పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.60కి చేరింది. డీజిల్ ధర రూ.77.73గా ఉంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!