Afhanistan: అఫ్గాన్ను కరుణించిన ప్రపంచ బ్యాంక్.. 280 మిలియన్ డాలర్లు సాయం!
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోగానే ఆ దేశం తాలిబన్ల హస్తగతమైన విషయం తెలిసిందే. మూడునెలులగా అఫ్గాన్లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడటంతో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అఫ్గాన్కు
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోగానే ఆ దేశం తాలిబన్ల హస్తగతమైన విషయం తెలిసిందే. మూడు నెలలుగా అఫ్గాన్లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పేదరికం పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడటంతో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అఫ్గాన్కు సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. అక్కడి ప్రజల్ని ఆదుకోవడం కోసం అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణ ట్రస్ట్ ఫండ్(ఏఆర్టీఎఫ్) నుంచి 280 మిలియన్ డాలర్లను రెండు ఐరాస అనుబంధ సంస్థలకు బదిలీ చేయడానికి ప్రపంచ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ దేశాల్లోని బ్యాంకులు అఫ్గానిస్థాన్ నిధుల్ని స్తంభింపజేశాయి. ఆ నిధులపై తమకు హక్కుందని, వాటిని వెంటనే విడుదల చేయాలని తాలిబన్ ప్రభుత్వం అభ్యర్థించినా.. డిమాండ్ చేసినా ఆయా బ్యాంకులు నిధుల విడుదలకు ససేమిరా అంటున్నాయి. అయితే, అఫ్గానిస్థాన్ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ప్రపంచ బ్యాంక్.. నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ట్రస్ట్ ఫండ్లో ఉన్న 1.5 బిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లు విడుదల చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటగా 280 మిలియన్ డాలర్ల నిధులను ఐరాస అనుబంధ సంస్థలు.. యూనిసెఫ్, ప్రపంచ ఆహార సంస్థలకు మళ్లించడానికి సిద్ధమైంది. అయితే, ఇందుకు ఏఆర్టీఎఫ్కు విరాళాలు ఇచ్చిన 31 మంది దాతల ఆమోదం అవసరమవుతుందనీ.. ఇందుకోసం దాతలంతా శుక్రవారం సమావేశం కానున్నట్లు ప్రపంచ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)