టాప్ కొరియోగ్రాఫర్ మెచ్చిన డ్యాన్స్ ఇది..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సూపర్హిట్ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అధిక మొత్తంలో వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే...
త్రివిక్రమ్ చూస్తే కచ్చితంగా పిలుస్తారు: శేఖర్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సూపర్హిట్ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ ఎంతో విభిన్నంగా చిత్రీకరించారు దర్శకుడు త్రివిక్రమ్. శ్రీకాకుళం మాండలికంలో ‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’ అనే పాటకు అనుగుణంగా ఫైట్ చూపించారు. దీనికి థియేటర్లలో అభిమానులు సైతం ఈలలు వేసి గోల చేశారు.
కాగా, ప్రదీప్ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ ఛాంపియన్స్’. దక్షిణాదిలో పేరు పొందిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో రష్మి-సుధీర్, ఆది-వర్షిణి టీమ్ లీడర్లగా మెప్పిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఈ షో తాజాగా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా సెమీస్ రౌండ్-2లో ఆది-వర్షిణి టీమ్కు చెందిన సోమేశ్ తన డ్యాన్స్తో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు.
‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’ అనే పాటకు సోమేశ్.. ఇసుకతో వేసిన డ్యాన్స్ చూసి సెట్లో ఉన్నవాళ్లందరూ ‘వావ్’ అన్నారు. పెర్ఫామెన్స్ అనంతరం శేఖర్ మాట్లాడుతూ.. ‘పవర్ప్యాక్డ్ పెర్ఫామెన్స్ సోమేశ్. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. నువ్వు అద్భుతమైన కంటెస్టెంట్వి’ అని అన్నారు. అనంతరం సోమేశ్కి డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్న చిట్టి మాస్టర్పై స్పందిస్తూ.. ‘చిట్టి.. సోమేశ్ డ్యాన్స్ గురించి ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. నటరాజ స్వామే వచ్చి డ్యాన్స్ చేసినట్లు ఉంది. సాంగ్కి అనుగుణంగా ఇసుక థీమ్ని బాగా సృష్టించావు. థమన్ ఈ సాంగ్ని చాలా బాగా కంపోజ్ చేశారు. ఇది డ్యాన్స్ సాంగ్ కాదు. ఫైట్ సాంగ్. కానీ, వినే కొద్ది వినాలనిపించేలా ఉంటుంది. ఇలాంటి పాటకు కొరియోగ్రఫీ క్రియేట్ చేసి పెర్ఫామెన్స్ చేయడం నాకు బాగా నచ్చింది. ఒకవేళ త్రివిక్రమ్గారు ఇది చూస్తే.. తప్పకుండా నిన్ను పిలుస్తారు’ అని శేఖర్ మాస్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ