Megha Akash: ప్రేమ వివాహాన్నే ఇష్టపడతా!
‘‘తల్లిదండ్రుల ప్రేమ.. పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ.. పిల్లల ప్రేమ.. ఇలా జీవితంలో అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి.
‘‘తల్లిదండ్రుల ప్రేమ.. పెళ్లయ్యాక భాగస్వామి ప్రేమ.. పిల్లల ప్రేమ.. ఇలా జీవితంలో అనేక దశల్లో వివిధ రకాల ప్రేమలు మనల్ని, మన వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేస్తుంటాయి. వ్యక్తులుగా మనల్ని గొప్పవాళ్లుగా తీర్చిదిద్దేది ఆ ప్రేమ ఒక్కటే. అందుకే నా దృష్టిలో ప్రేమ గొప్పది. నిస్వార్థమైనది’’ అంది నటి మేఘా ఆకాష్. ఇటీవలే ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ఈ భామ.. ఇప్పుడు ‘డియర్ మేఘ’ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైంది. ఆమె టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుశాంత్ రెడ్డి తెరకెక్కించారు. అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడింది మేఘ.
‘‘దర్శకుడు సుశాంత్ ఓరోజు ఫోన్ చేసి తన దగ్గర నాకు సరిపడే ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఉందని చెప్పారు. నాకు మొదట్లో భయమేసింది. ఎందుకంటే నాయికా ప్రాధాన్య చిత్రమంటే చాలా ఒత్తిడి తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను పరిస్థితుల్లో కచ్చితంగా రిస్క్ చేయాలి.. కొత్త తరహా కథాంశాలు ఎంచుకోవాలి అనుకున్నాను. ‘డియర్ మేఘ’ కథ విన్నప్పుడు రొమాంటిక్గా, ఎంతో ఎమోషనల్గా అనిపించింది. చక్కటి లవబుల్ ఫిల్మ్ అనిపించింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్ కూడా. అందుకే ఈ కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా’’.
* ‘‘అబ్బాయి.. అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఇంకా ఎన్నో రకాల ప్రేమలుంటాయి. ఈ సినిమాతో నిజమైన ప్రేమ అంటే ఏమిటి.. అన్ కండిషనల్ లవ్ ఎలా ఉంటుంది? అన్నది ప్రేక్షకులు తెలుసుకుంటారు. దీన్నొక ముక్కోణపు ప్రేమకథ అనుకోవచ్చు. ప్రతి ప్రేమకథలో ఉన్నట్లే ఇందులోనూ కొంత ట్రాజెడీ ఉంటుంది. నేనిందులో మేఘ అనే అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్రకి నా వ్యక్తిగత జీవితానికి చాలా పోలికలున్నాయి. మేఘ లోపల చాలా అల్లరి పిల్ల. బయటకు మాత్రం చాలా కామ్గా కనిపిస్తుంటుంది. నేను కూడా అంతే’’.
* ‘‘ఈ చిత్ర విషయంలో నటిగా నాపై ఎప్పుడూ కొంత ఎక్కువ ఒత్తిడి ఉంటుండేది. ఎందుకంటే బరువైన పాత్ర ఇది. నేనిప్పటి వరకు ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమకథలో నటించలేదు. అరుణ్ అదిత్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి నటించడం ఇన్నాళ్లకు కుదిరింది. ఈ సినిమా విషయంలో నిర్మాత అర్జున్ నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడైనా అనుకోని కారణాల వల్ల చిత్రీకరణకు రాలేకపోయినా పరిస్థితులు అర్థం చేసుకునేవారు’’.
* ‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ ఉంటుంది. అలాగే నా జీవితంలోనూ ఉంది. అయితే ‘డియర్ మేఘ’ చిత్రంలో జరిగినట్లు నా జీవితంలో జరిగిందా అనేది చెప్పలేను. నాలుగో తరగతిలో నా పక్కన కూర్చునే అబ్బాయిపై నాకు ఇష్టం ఏర్పడింది. నాకు తెలిసి అదే నా తొలి ప్రేమ (నవ్వుతూ). ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నేను వ్యక్తిగతంగా ప్రేమ వివాహాన్నే ఇష్టపడతా. నాకు కాబోయే భాగస్వామి నన్ను నాలా ఉండనివ్వాలి’’.
* ‘‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ప్రణాళికలు వేసుకున్నాను. కానీ, ఇక్కడ మన ప్రణాళికలకు అనుగుణంగా ఏది జరగదని అర్థమైంది. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని కొన్నాళ్లకు తెలుసుకున్నా. మొదట్లో నాకంటూ కొన్ని పరిమితులుండేవి. అందుకే తగ్గ పాత్రలే ఎంచుకుని సినిమాలు చేశా. కానీ, ఇప్పుడు నా ఆలోచనా విధానం మారింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నా. ప్రస్తుతం నేను ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలోఉన్నాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.