చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది.. ప్రభుత్వాలు ఆదుకోవాలి
‘‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా.. ఏ సమస్యలొచ్చినా ముందుగా స్పందించేది మా చిత్ర పరిశ్రమే. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున సంక్షోభంలో పడిపోయింది. సినిమా వ్యయాలు పెరిగిపోయాయి. ఎక్కడా రాజీ పడే పరిస్థితులు లేవు.
- చిరంజీవి
‘‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా.. ఏ సమస్యలొచ్చినా ముందుగా స్పందించేది మా చిత్ర పరిశ్రమే. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున సంక్షోభంలో పడిపోయింది. సినిమా వ్యయాలు పెరిగిపోయాయి. ఎక్కడా రాజీ పడే పరిస్థితులు లేవు. అందుకే ఇండస్ట్రీని ఆదుకునేందుకు ముందుకు రావాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని వినమ్రంగా కోరుతున్నా’’ అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘లవ్స్టోరీ’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, కథా నాయకుడు చిరంజీవి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘లవ్స్టోరీ’ టైటిల్ విన్నప్పుడే చాలా ఆసక్తిగా అనిపించింది.
నాగచైతన్య మంచి కథలు ఎంచుకుంటుంటాడు. ఈ ‘లవ్స్టోరీ’ తనకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ ‘లవ్స్టోరీ’ ప్రీరిలీజ్ వేదికగా రెండు ప్రభుత్వాలకి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా సమస్యల్ని రెండు ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం. సానుకూలంగా స్పందించారు. కానీ, ఇంత వరకు జీవో రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సభా వేదికగా అడుగుతున్నాను. మీరు కనికరించండి. మా వినతిని ప్రత్యేకంగా తీసుకోండి. నలుగురు హీరోలు, నలుగురు దర్శకులు బాగా సంపాదించుకుంటున్నారు కదా అని అంతా బాగున్నట్లే అనుకోకండి. ఆ నలుగురైదుగురినే దృష్టినే పెట్టుకుని ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి.. మా అభ్యర్థనల్ని మన్నించండి. మేం ఆశగా అడగట్లేదు. అవసరానికి అడుగుతున్నాం. అది మీరు ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేకపోతే మేం సినిమాలు పూర్తయ్యి కూడా రిలీజ్ చేయాలో లేదో తెలియని సందిగ్దంలో పడిపోతున్నాం. అసలు జనం వస్తారా? రారా? అన్న పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తోంది. ప్రభుత్వాలు తమ వంతు ధైర్యాన్ని మాకు అందించాలి. ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమను చూస్తున్నాం. ఇక్కడ సక్సెస్ రేటు పది నుంచి ఇరవై శాతం మధ్యే ఉంటుంది. దీనికే ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అనుకుంటుంటారు. కానీ, ఇక్కడ కష్టాలు పడేవారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు.. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉన్నారు. కొందరు బాగున్నంత మాత్రాన పరిశ్రమ మొత్తం పచ్చగా ఉన్నట్లు కాదు. అది కరోనా సమయంలో సుస్పష్టంగా తెలిసొచ్చింది. చిత్రీకరణలు ఆగిపోయే సరికి కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారన్నది కళ్లారా చూశాం. మాకు తోచినట్లుగా వాళ్లని.. వీళ్లని, సినీ హీరోలు, ఇతర పెద్దల్ని అడిగి.. కార్మికులకు నిత్యావసరాలు అందించాం’’ అన్నారు.
ఈ వేడుకలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ‘‘నాగచైతన్యను ‘లాల్ సింగ్ చద్దా’ కోసం తొలిసారి కలిశాను. తనతో పనిచేస్తుంటే.. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. ఈ వేడుక కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ‘లవ్స్టోరీ’ ట్రైలర్ నాలుగు రోజుల క్రితమే చూశా. చాలా నచ్చింది. సినిమాలోని సాయిపల్లవి డ్యాన్స్కి ఫిదా అయ్యాను. శేఖర్ కమ్ములపై అతిథులు చూపిస్తున్న ప్రేమ నన్ను కదిలిస్తోంది’’ అన్నారు.
* తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి జంట ఈ సినిమాలో చాలా బాగుంది. వాళ్లిద్దరూ బాగా నటించారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది’’ అన్నారు.
* హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘లవ్స్టోరీ’ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమా కోసం చేయనంతగా ఈ చిత్రంలోని పాత్ర కోసం కష్టపడ్డా. శేఖర్ కమ్ముల చెప్పిన కథలోని లోతు చూసినప్పుడు.. ఈ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్లొచ్చు అనిపించింది’’ అన్నారు.
* ‘‘లవ్స్టోరీ’ చూశాక ఓ మంచి ఆలోచనతో ఇంటికి వెళ్తారు. అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన విషయం ఉంది’’ అంది నాయిక సాయిపల్లవి.
* దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘సినిమా గురించి చిరంజీవి చెప్పిన మాటలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి. ఆమిర్లా మరే స్టార్ సమాజం కోసం ఆలోచించలేర’’న్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నారయణ దాస్ కె.నారంగ్, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, పవన్ సి.హెచ్, చైతన్య పింగళి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్