Aadavaallu Meeku Joharlu:విడుదలకు ముహూర్తం

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Updated : 29 Jan 2022 06:59 IST

శర్వానంద్‌, రష్మిక జంటగా తిరుమల కిషోర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా శర్వా, రష్మిక జంటగా ఉన్న ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మంచి కథతో తెరకెక్కుతోన్న కుటుంబ కథా చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యముంది. శర్వా, రష్మికల జంటకు మంచి మార్కులు పడతాయి. ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. సుజిత్‌ సారంగ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని