HBD Nagarjuna: సాహసాల ‘గ్రీకువీరుడు’.. అభిమానుల ‘మన్మథుడు’
Nagarjuna: నిత్య మన్మథుడు.. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
సైకిల్ చైన్ తెంచి టాలీవుడ్ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. ‘హలో గురు ప్రేమకోసమే’అని పాడుకుంటూ హీరోయిన్ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు. మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు. క్యాన్సర్ బాధితుడిగా ‘గీతాంజలి’లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ సినిమాలకి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీ లోకం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ టాలీవుడ్ ‘కింగ్’గా సాగిపోతున్నారాయన. ఇవాళ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
సాహసాలకు వెనకాడని నైజం
కెరీర్ ఆరంభం నుంచే తన సాహసాలతో టాలీవుడ్ను ఆశ్చర్యపరిచిన హీరో నాగార్జున. ‘విక్రమ్’తో వెండితెర అరంగేట్రం చేసిన నాగ్ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరేందుకు ఓ రకంగా ఆ సాహసాలే తోడ్పడ్డాయని చెప్పొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా లేని ఓ పాతికేళ్ల కుర్రాడికి డైరెక్టర్గా అవకాశమివ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఆ కుర్ర దర్శకుడే రామ్గోపాల్ వర్మ. వీరిద్దరూ తీసిన ‘శివ’ టాలీవుడ్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఇలాంటి సాహసాలు తన కెరీర్లో మరెన్నో చేశాడాయన. అగ్రహీరోలంతా కమర్షియల్ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్న సమయంలో ‘గీతాంజలి’ లాంటి విషాద కావ్యాన్ని టాలీవుడ్కు అందించి తన మార్క్ చూపించాడు. భక్తి చిత్రాలకు కమర్షియల్ సినిమాల స్థాయి కలెక్షన్లు రప్పించడం నాగార్జునకే చెల్లింది. ‘ఘరానా బుల్లోడు’, ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి సూపర్ హిట్లు తీసిన తర్వాత ‘అన్నమయ్య’ లాంటి భక్తిరస చిత్రాన్ని ఎంచుకోవడం కూడా అప్పట్లో ఓ సాహసమే.
అమ్మాయిల కలల రాకుమారుడు
90వ దశకం నుంచే తెలుగమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు నాగార్జున. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో మహిళల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా నాటికి ఆ అభిమానం తారస్థాయికి చేరింది. ఆ తర్వాత వచ్చిన ‘మన్మథుడు’, ‘సంతోషం’ లాంటి సినిమాలతో టాలీవుడ్ మన్మథుడిగా మారిపోయారు. పురుషులతో సరిసమానమైన మహిళా అభిమానులను నాగార్జునకు ఉన్నారనడంలో సందేహం అక్కర్లేదు.
బుల్లితెరపైనా విశ్వరూపం
వెండితెరపై ఎన్నో హిట్లిచ్చిన నాగార్జున.. బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. తొలిసారి ఆయనే నిర్మించిన ‘యువ’ అనే సీరియల్లో మెరిసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీలో పాపులర్ రియాలిటీ షో అయినా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తీసుకొచ్చారు షో నిర్వాహకులు. ఆ కార్యక్రమాన్ని తనదైన స్టైల్ జోడించి రక్తి కట్టించారు. ఆ తర్వాత ‘బిగ్బాస్’కి కూడా హోస్ట్ గా చేసి మెప్పించారాయన. త్వరలోనే బిగ్బాస్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ఈ రియాలిటీ షోలతో బుల్లితెరపైనా అభిమానులను సంపాదించుకున్నారాయన.
ఏఎన్నాఆర్తో ఆరు
తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేసిన లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ వారసత్వాన్ని నాగార్జున విజయవంతంగా కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు. ఆయనతో నాగార్జున చేసిన చివరి సినిమా ‘మనం’ మంచి విజయం సాధించింది. అయితే వీరిద్దరూ దీనికన్నా ముందు మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగార్జున హీరో అయ్యాక తొలిసారి ‘రావుగారి ఇల్లు’లో నటించారు. ఆ తర్వాత ‘కలెక్టరుగారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘ఇద్దరూ ఇద్దరే’, ‘శ్రీరామదాసు’ ఇలా మొత్తం ఆరు సినిమాల్లో కలిసి నటించారు. అయితే అంతకుముందే ఏయన్నార్ ‘సుడిగుండాలు’ చిత్రంలో బాలనటుడిగా చేశాడు నాగ్. తండ్రి ఏయన్నార్తోనే కాకుండా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య,అఖిల్లతోనూ కలిసి నటించారాయన.
వైవిధ్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
ఓ వైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల్లో నాగ్ కచ్చితంగా ముందుంటారు. ఇండస్ట్రీ హిట్లు అందించినప్పుడు.. ఆ వెంటనే ఏదో ఒక విభిన్న కథాంశంతో చిత్రాలను ముందుకు తెచ్చేవారాయన. ‘విక్కీదాదా’తో హిట్ కొట్టిన వెంటనే ‘గీతాంజలి’ విడుదలైంది. అందులో క్యాన్సర్ రోగిగా ఆయన నటనకు ప్రశంసల జల్లు కురిసింది. ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి రొమాంటిక్ సినిమాతో బాక్సాఫీస్ కాసుల వర్షం కురిపించిన ఆయన, ఆ వెంటనే ‘అన్నమయ్య’ సినిమా చేశారు. ఇలా ఓ వైపు కమర్షియల్ హిట్లు కొడుతూనే ఆ వెనువెంటనే వైవిధ్యంగా దర్శనిమిచ్చేవారు. ఇలాగే ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాల తర్వాత ‘ఊపిరి’ సినిమా చేశారు. అందులో కాళ్లు, చేతులు పనిచేయని సంపన్నుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో నటిస్తుండగా, కల్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘బంగార్రాజు’గా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు నాగ్. హిందీలో ‘బ్రహ్మస్త్ర’లోనూ నటిస్తున్నారు. నాగ్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ... ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ