Allu Arjun: ‘పుష్ప’ సక్సెస్.. పారితోషికం పెంచేసిన ఐకాన్స్టార్..!
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్హిట్ సొంతం చేసుకుంది...
హైదరాబాద్: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’. గతేడాది చివర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్హిట్ సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులతోపాటు సెలబ్రిటీలు సైతం ‘పుష్పరాజ్’పై అమితమైన అభిమానాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ ఇచ్చిన కిక్తో మరో పాన్ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ క్రమంలోనే ఆయన తదుపరి ప్రాజెక్ట్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్లో బన్నీ ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల పారితోషికం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ దర్శకులు అట్లీ, మురుగదాస్ల్లో ఒకరు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వాళ్లిద్దరూ ఇప్పటికే బన్నీ కోసం కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారట. బన్నీ ఎవరికి ఓకే చెబితే వారితో ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉండనుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ