SP balu: భావోద్వేగంగా సాగిన ‘బాలుకు ప్రేమ’తో ప్రోమో

‘బాలుకు ప్రేమ’తో సెకండ్‌ ప్రోమో

Published : 22 Sep 2021 22:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని స్మరిస్తూ ‘ఈటీవీ’ ప్రత్యేకంగా ‘బాలుకు ప్రేమతో’ కార్యక్రమాన్ని రూపొందించింది. సుమ యాంకర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమం ‘ఈటీవీ’లో త్వరలో ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘బాలుకు ప్రేమతో’ రెండో ప్రోమో విడుదలై భావోద్వేగానికి గురిచేస్తోంది. బాలు వాడిన మైక్‌ను రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎస్పీ చరణ్‌కు అందజేశారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, రచయితలు పాల్గొని బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. మనో, సునీత, చిత్ర పాడిన పాటలు బాలు అభిమానుల గుండెను తడి చేస్తున్నాయి. బాలు చివరి రోజుల్లో ఆసుపత్రి బెడ్‌పై ఎలా ఫీలై ఉంటారో అనేది పాట రూపంలో కీరవాణి పాడుతుంటే కార్యక్రమానికొచ్చిన అతిథుల కళ్లు చెమ్మగిల్లాయి. రాజేంద్రప్రసాద్‌, మణిశర్మ, జొన్నవిత్తుల, ఆనంత శ్రీరామ్‌లు బాలు గొప్పతనాన్ని వివరించారు. భావోద్వేగపూరితంగా సాగిన ఈ కార్యక్రమం ఈ నెల 26న ‘ఈటీవీ’లో ప్రసారం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని