Enjoy Enjaami: 2 నెలలు 200 మిలియన్స్ వ్యూస్
Enjoy Enjaami మార్చి 7, 2021న యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్డెస్క్: ఒకప్పుడు ‘వై దిస్ కొలవెరి’కి ప్రపంచం వెర్రెత్తిపోయింది.. గంగ్నమ్ డ్యాన్స్కు గంతులేసింది.. ప్రియా ప్రకాశ్ వారియర్ కన్ను కొడితే యువకుల హృదయాలు కుదేలైపోయాయి. ఇలా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా సందడి చేస్తూనే ఉంది. ఇప్పుడు ట్రెండ్ ‘ఎంజాయ్ ఎంజామీ’ది. మార్చి 7, 2021న యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ మ్యూజిక్ వీడియో కేవలం రెండు నెలల్లోనే 200 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సింగిల్ సాధించని రికార్డు సృష్టించింది.
అరివు సాహిత్యం అందించిన ఈ పాటను గాయని దీ(దీక్షితా వెంకటేశన్) ఆలపించారు. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణ్ నిర్మించారు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే అన్ని వేదికల్లోనూ ‘ఎంజాయ్ ఎంజామీ’కి విశేష స్పందన లభించింది. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ ఈ పాటపై ప్రశంసల జల్లు కురిపించారు. ధనుశ్, సాయి పల్లవి, సిద్ధార్థ్, విఘ్నేశ్ శివన్, దుల్కర్ సల్మాన్, లోకేశ్ కనకరాజ్, పా.రంజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, ఇలా ఎంతోమంది మెచ్చుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల వేదికగా ఈ పాటకు వందలాది కవర్ సాంగ్స్ వచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ పాటకు తమదైన శైలిలో స్టెప్లు వేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేరళ, తమిళనాడు పోలీసులు కూడా ఈ పాటతోనే కరోనా వైరస్, మాస్క్ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇంతకీ ఏంటీ ‘ఎంజాయ్ ఎంజామీ’
ఈ పాటకు సాహిత్యం అందించిన వ్యక్తి తమిళ పాటల రచయిత అరివు. గతంలో ‘కాలా’, ‘మాస్టర్’ సహా పలు తమిళ చిత్రాలకు పాటలు రాశారు. అరివు బామ్మ వల్లిఅమ్మాళ్ ఎప్పుడూ తనని ‘ఎంజామీ(మై డియర్, నా దేవుడు) అంటూ పిలుస్తూ ఉండేదట. శ్రీలంకలోని టీఎస్టేట్లలో ఆమె నిర్బంధ కార్మికురాలిగా పని చేశారు. అక్కడి ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, జీవన పరిస్థితుల నుంచే ఈ పాటకు ప్రాణం పోశారు అరివు. బ్రిటిషు పాలకులు తేయాకు తోటల్లో పనిచేసేందుకు భారత్ నుంచి అతి తక్కువ వేతనాలకు కూలీలను శ్రీలంకకు తరలించేవారు. తేయాకు తోటల్లో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం కొందరిని యజమానులు నిలిపివేసేవారు. దీంతో వారు గత్యంతరం లేక భవన నిర్మాణ కూలీలుగా ఇతర ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసి జీవనం కొనసాగించేవారు. ఆ నాటి దుర్భర పరిస్థితులకు కళ్లకు కడుతూ ఈ పాటను రచించారు అరివు. మానవత్వం, భూమితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గురించి వర్ణిస్తూ ఈ పాటను ఆవిష్కరించారు. ఈ వీడియో చివర్లో వల్లి అమ్మాళ్ కనపడతారు. ఎన్సామి అంటే తమిళంలో నా దేవుడా అని అర్థం ఆ పదాన్నే శ్రీలంకలో ఎంజామీగా పలుకుతారు.
ఎక్కడెక్కడ వినవచ్చు
ఎంజాయ్ ఎంజామీ పాటను మాజా లేబుల్పై ఏఆర్ రెహమాన్ విడుదల చేశారు. యూట్యూబ్తో పాటు, స్ఫూటిఫై, జియో సావన్, గానా, యాపిల్ మ్యూజిక్, ఐట్యూన్స్, అమెజాన్ మ్యూజిక్, హంగామా, రాగా.కామ్ వేదికల ద్వారా కూడా ఈ సాంగ్ వినవచ్చు. విడుదలైన రెండు వారాల్లోనే స్ఫూటిఫైలో ఈ పాట 2 మిలియన్ స్ట్రీమింగ్స్ దాటింది. మార్చి 10న వీడియో అందుబాటులోకి రాగా రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ దాటేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!