Adipurush: ఒకేసారి 20,000 స్క్రీన్స్పై ‘ఆదిపురుష్’
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలను భారీగా తీర్చిదిద్దేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనే....
హైదరాబాద్: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలను భారీగా తీర్చిదిద్దేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. అలా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోన్న ప్రభాస్ చిత్రాల్లో ఒకటి ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో కనిపించగా, నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ బడ్జెట్, రిలీజ్పై కొన్ని ఆసక్తికర విశేషాలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మొత్తం బడ్జెట్ విలువ రూ.400 కోట్లని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో.. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘ఆదిపురుష్’ని పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా పిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం