Vidya Balan: ప్ర‌తి ఇంట్లోనూ ‘షేర్నీ’ ఉంది

ఇప్ప‌టికే ప‌లు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో న‌టించి సత్తా చాటింది విద్యా బాల‌న్. ఇప్పుడు ‘షేర్నీ’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించేందుకు రానుంది.

Published : 16 Jun 2021 01:21 IST

ఇంట‌ర్నెట్ డెస్క్: ఇప్ప‌టికే ప‌లు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో న‌టించి సత్తా చాటింది విద్యా బాల‌న్. ఇప్పుడు ‘షేర్నీ’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెప్పించేందుకు రానుంది. ఇందులో అట‌వీ శాఖ అధికారిణిగా క‌నిపించ‌నుంది. అమిత్ మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమా జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా విద్యా బాల‌న్ చెప్పిన సంగ‌తులివీ..

* ‘‘త‌మ జీవితంలో ఎన్నో సవాళ్ల‌ని అధిగమిస్తోన్న మ‌హిళ‌లంద‌రికీ ఈ చిత్రం ప్ర‌తీక‌గా నిలుస్తుంది. భార‌త‌దేశంలోని ప్ర‌తి ఇంట్లోనూ ఓ షేర్నీ(ఆడ‌పులి) ఉంది. అయితే చాలా సంద‌ర్భాల్లో ఆమె వెలుగులోకి రాలేక‌పోతుంది. అందుకోసం ప్ర‌తిసారి గ‌ర్జించాల్సిన‌ అవ‌స‌రం లేదు. మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకునేందుకు చాలా మార్గాలున్నాయి. ఈ సినిమాలోని నా పాత్ర‌ రిజ‌ర్వుడ్‌గా ఉంటూనే బ‌ల‌మైన సంక‌ల్పంతో సాగుతుంది. దాన్ని చూసి మ‌నకి మ‌నం ఎలా ఎదగాలో తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తి మ‌హిళా ఓ పులి అని నేను న‌మ్ముతా. ఎందుకంటే జీవిత‌మ‌నే అడ‌విలో ఆమె త‌న మార్గాన్ని అన్వేషిస్తుంది. త‌న‌కు కావాల్సింది సాధించుకునేందుకు ప్ర‌తి మ‌హిళా అడుగ‌డుగునా ఎన్నో స‌మ‌స్య‌లకి లోన‌వుతుంద‌నే విష‌యం నాకు తెలుసు’’.

* ‘‘ నేను కావాల‌ని స్ఫూర్తిన్నిచ్చే చిత్రాల్ని ఎంపిక చేసుకునే ప్ర‌యత్నం చేయ‌ను. ఒక‌వేళ నేను ఎంపిక చేసుకున్న సినిమాలు స్ఫూర్తినిస్తే అది నాకు బోన‌స్ అని ఫీల‌వుతా. నేను ఎప్పుడూ బల‌మైన క‌థ‌ల్ని, నిజాయ‌తీగా ఉండే పాత్ర‌ల్ని ఎంపిక చేసుకుంటాను. ఫిమేల్ సెంట్రిక్ క‌థ‌ల్లో హీరోలా న‌టించేందుకు ఇష్ట‌ప‌డ‌తా’’.

- అట‌వీ ప్రాంతంలోని ఓ గ్రామంపై పులి దాడి నేప‌థ్యంలో రూపొందింది ఈ చిత్రం. అట‌వీ అధికారిగా ఆ క్రూర మృగాన్ని ప‌ట్టుకునేందుకు విద్యా బాల‌న్‌ ఏం చేసింది? ఆ గ్రామాన్ని స‌మ‌స్య‌ నుంచి గ‌ట్టెక్కించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో శ‌ర‌త్ స‌క్సేనా, విజ‌య్ రాజ్‌, ముకుల్, నీర‌జ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.
    


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని