Chiranjeevi: ఇండస్ట్రీని ఆదుకోండి.. తెలుగు ప్రభుత్వాలకు చిరు విజ్ఞప్తి
Tollywood: కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: ‘ఏ విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగు ప్రభుత్వాలను కోరారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ ‘లవ్స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ఖాన్, అగ్ర కథానాయకుడు చిరంజీవి విచ్చేశారు. ‘లవ్స్టోరీ’ చిత్ర బృందానికి చిరు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా పరిస్థితులను దాటుకొంటూ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు.
‘‘కొవిడ్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావటం చిన్నపిల్లవాడు స్కూల్కు వెళ్తున్న భావన కలుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. చిత్ర పరిశ్రమలో సక్సెస్రేట్ అనేది చాలా తక్కువ. 10-15శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే, 20శాతం. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా, కళకళలాడిపోతోందంటారు. కానీ, ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది.. పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే చిత్ర పరిశ్రమ. నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. వీళ్లు బాగున్నారు కదాని, సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ విషయం కరోనా సమయంలో స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలు షూటింగ్స్ ఆగిపోయే సరికి, కార్మికులు అల్లాడిపోయారు. హీరోలను, సినీ పెద్దలను, నిర్మాతలను అడిగి డబ్బులు పోగుచేసి, కార్మికుల కోసం నిత్యావసర సరకులు అందించాం. ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. కానీ, ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా’’
‘‘ఏ విపత్తు వచ్చినా అందరి కంటే ముందు స్పందించేది చిత్ర పరిశ్రమ మాత్రమే! ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈరోజు సంక్షోభంలో పడిపోయింది. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఎక్కడా సర్దుకుపోయే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ‘లవ్స్టోరీ’ ప్రీరిలీజ్ వేడుక వేదికగా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇంకా ఏం చేస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది? ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వస్తువులు, కాయగూరలను ముందు చూసి ఆ తర్వాత కొంటాం. కానీ ముందు కొనేసి, ఆ తర్వాత చూసేది సినిమాను మాత్రమే! మా మీద నమ్మకంతోనే మీరు(ప్రేక్షకులు) సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి ఉన్నాడంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మరో ఆలోచన లేకుండా థియేటర్కు వస్తారు. మేము కూడా నిరాశ పరచకుండా మా వంతు కృషి చేస్తుంటాం. దాని వల్ల వ్యయం పెరగవచ్చు. కొన్ని సార్లు మా అభిరుచుల మేరకు సినిమా తీసి ఫెయిల్యూర్ కావచ్చు. అది మా తప్పిదం’’
‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకునే మాకు, సాధకబాధకాలు ఉన్నప్పుడు మీరు దయ చేసి దీనిపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలి. ‘మేము ఆశగా అడగటం లేదు.. అవసరానికి అడుగుతున్నాం’. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా. సినిమాలు పూర్తయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ‘ఆచార్య’ అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి? ఎలా రిలీజ్ చేయాలి? చేస్తే రెవెన్యూ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా? అన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. ‘లవ్స్టోరీ’ అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుందని అనుకుంటున్నా. అయితే, రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ విషయంలోనే ప్రభుత్వాలు మనకు ధైర్యం, వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ