Naresh: ఆ వివాదంతో ‘మా’కు సంబంధం లేదు.. అందుకే స్పందించలేదు: నరేశ్
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రమ్మని ఒకట్రెండు పార్టీలు ఆహ్వానించాయని, కానీ తనకు రావటం ఇష్టం లేదని సినీ నటుడు నరేశ్(Naresh) అన్నారు.
హైదరాబాద్: సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్య, వివాదం విషయంలో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు సంబంధం లేదని, అది కేవలం ‘మా’ సభ్యుల సంక్షేమం కోసమే ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ అని సినీ నటుడు నరేశ్(Naresh) అన్నారు. సినీ పరిశ్రమ, ముఖ్యంగా ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను నిరంతరం కష్టపడతానని స్పష్టంచేశారు. నటుడిగా, నిర్మాతగా మరింత ముందుకు వెళ్లాలని ఉందని అన్నారు. జనవరి 20న నరేశ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రమేశ్బాబును కోల్పోవడం, కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని తెలిపారు.
‘‘పండంటి కాపురం’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశా. ఈ ఏడాదితో నేను సినీ కెరీర్ను మొదలు పెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సంవత్సరాల ప్రయాణం చాలా అరుదు. అందుకు కృష్ణ గారు, విజయ నిర్మలగారితో పాటు, మా గురువు జంధ్యాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంతేకాదు, నా కెరీర్లో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు నన్ను ప్రోత్సహించారు. నటుడిగా కొనసాగుతూనే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించా. భాజపాతో పాటు కలిసి ప్రయాణం చేసి ఉన్నత పదవుల్లో ఉన్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు నా వంతు బాధ్యత నిర్వహించా. ఇప్పటికీ బిజీ యాక్టర్గా కొనసాగుతున్నా. అందుకు సినీ పరిశ్రమకు, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ప్రభుత్వం అందించే పథకాలు సినీ పరిశ్రమలో అర్హులైన వారికి అందేలా నా వంతు ప్రయత్నం చేస్తా’’
‘‘సెకండ్ ఇన్నింగ్స్లో యువ దర్శకులందరూ నాకు మంచి పాత్రలు ఇచ్చారు. గతేడాది విజయం సాధించిన ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించా. ఈ ఏడాది మరికొన్ని కొత్త పాత్రలు పోషిస్తున్నా. వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తున్నా. విజయకృష్ణ మూవీస్, విజయకృష్ణ ఎంటర్టైన్ ద్వారా సినిమాలు, వెబ్సిరీస్లు నిర్మిస్తాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వివిధ పదవుల్లో పనిచేశా. వెల్ఫేర్ కోసం ‘మా’లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశా. అదే గత ఎన్నికల్లో మాకు విజయాన్ని అందించింది. ‘మా’కు ఒకసారే అధ్యక్షుడిగా పోటీ చేస్తానని గతంలో చెప్పా. ఒకవేళ భవిష్యత్లో పోటీ చేసినా, ఇండస్ట్రీ బిడ్డగా, ‘మా’ సభ్యులకు సహకారం అందిస్తా’’
‘‘సినీ పరిశ్రమలో నష్టపోయేవారే ఎక్కువమంది ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తుంటారు. ఇతర రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా సమస్యలు ఉంటాయి. దీనిపై పెద్దలందరూ చర్చలు జరుపుతున్నారు. నేను ఆ వివాదంలోకి వెళ్లదలుచుకోలేదు. సినీపరిశ్రమ-ప్రభుత్వం కలిసి ఒక మంచి నిర్ణయానికి వస్తాయని అనుకుంటున్నా. ఇటీవల చిరంజీవిగారు కూడా సీఎం జగన్ను కలిశారు. ఈ విషయంలో ‘మా’ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ‘మా’ అనేది ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసింది. ఛాంబర్లో ఒక భాగం మాత్రమే. వాళ్ల వరకే మా బాధ్యత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు రాజకీయాలతో సంబంధం ఉండకూడదని నా అభిప్రాయం. కొవిడ్ ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో ‘మా’ సభ్యుల సంక్షేమమే మాకు ముఖ్యం. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఛాంబర్ నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగారిని కలుస్తుందని భావిస్తున్నా. పదవులు ఆశించి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేసేందుకు చాలా మంది ఉన్నారు. ఒక నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నిర్మాతగా సామాజిక కార్యకర్తగా ముందుకు సాగుతా. వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. నాకు వెళ్లాలని లేదు’’ అని నరేశ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్ పోస్ట్
15 ఏళ్ల క్రితం టూరిస్ట్లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు. -
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్
తన మొదటి సినిమా సల్మాన్తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్ చెప్పారు. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ