Alitho Saradaga: ‘మర్యాద రామన్న’ సినిమా నాకు మైనస్ అయింది: నాగినీడు
‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. కానీ, అదే నాకు మైనస్ అయింది’ అని నటుడు నాగినీడు అన్నారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నారు. ఆలీ అడిగిన ప్రశ్నలకు కొంటె సమాధానాలు చెప్తూ అలరించారు. ‘నాగినీడు.. ముందు ఏంటి? వెనక ఏంటి?’ అని ఆలీ అడగ్గా ‘1760 అనుకుంటా. నేను మచిలీపట్నం నుంచి తిరిగొస్తుంటే కలవపాముల గ్రామంలో నన్ను ఆపి ఈ ఊరు శిథిలమైపోయిందని, బాగు చేయాలని నన్ను అడిగితే అక్కడ సెటిల్ అయిపోయా. కొంతకాలం తర్వాత వెళ్లిపోయా. మళ్లీ వచ్చా. మళ్లీ వెళ్లిపోయా, వచ్చా’ అంటూ ఆలీని కన్ఫ్యూజ్ చేశారు. ‘మీకు ఎంతమంది పిల్లలు’ అనే ప్రశ్నకు ‘నాకు రెండు మైనస్లు (కొడుకులు)’ అని చమత్కరించారు.
‘నా జీవితం ప్రసాద్ ల్యాబ్స్కి అంకితమైంది. నేను థియేటర్లో చూసిన తొలి చిత్రం ‘పూల రంగడు’ (అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కింది). చూసిన వెంటనే నటుడవ్వాలనే కోరిక కలిగింది. అదే సమయంలో రాజబాబుగారిని ఇమిటేట్ చేసేవాడ్ని. నేను నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. కానీ, అదే మైనస్ అయింది. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే ‘నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా’ అనేవారు. ఇవన్నీ ఎందుకు నాకు డబ్బొస్తే చాలు అని మనుసులో అనుకునేవాడ్ని’ అని తన సినీ కెరీర్ గురించి చెప్పారు. చివరిగా.. ఓ దర్శకుడు తనపై సీరియస్ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరు? తెలియాలంటే నవంబరు 15 వరకు వేచి చూడాల్సిందే. ‘ఈటీవీ’ వేదికగా వచ్చే సోమవారం ఈ ఎపిసోడ్ ప్రసారంకానుంది.
‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మి కల్యాణం’ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన నాగినీడుకు ‘మర్యాద రామన్న’ చిత్రం మంచి గుర్తింపునిచ్చింది. రామినీడుగా కనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆ తర్వాత ‘పిల్ల జమీందార్’, ‘సీమ టపాకాయ్’, ‘ఇష్క్’, ‘బెంగాల్ టైగర్’, ‘స్పైడర్’, ‘రూలర్’, ‘వకీల్సాబ్’ తదితర చిత్రాలతో అలరించారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా