Tollywood: వారసుల తోడుగా.. తెరపై మెరవగా
చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే
చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే ఇలాంటి అపురూప కలయికల చిత్రాలు.. త్వరలో అనేకం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడిలా వారసులతో కలిసి సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.
సినీ తారలు తమ నట వారసులతో కలిసి సందడి చేయడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి ఎన్టీఆర్, ఏయన్నార్ల తరం నుంచి ఇప్పటి చిరంజీవి, నాగార్జునల తరం వరకు అనేక మంది స్టార్లు తమ వారసులతో కలిసి తెర పంచుకున్న వారే. ఈ తరహాలో ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ సినీప్రియులకు ఎంతో ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో ఏయన్నార్ ఒకేసారి ఇటు తనయుడు నాగార్జునతోను, అటు మనవళ్లు నాగచైతన్య, అఖిల్లతోనూ కలిసి సందడి చేసి మెప్పించారు. అలాగే కథానాయకుడు నాగార్జున ఇటీవల తన తనయుడు నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’లో నటించారు.
చిరు.. చిరుతల సందడి..
‘బంగార్రాజు’ లాంటి మ్యాజిక్నే ‘ఆచార్య’తో చేసి చూపించనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన తన తనయుడు రామ్చరణ్తో కలిసి నటించిన తొలి చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా కన్నా ముందు ‘మగధీర’, ‘బ్రూస్లీ’ వంటి చిత్రాల్లో చరణ్తో కలిసి తెరపై కనిపించారు చిరు. అవన్నీ అతిథి పాత్రలే. పూర్తి స్థాయిలో కలిసి నటించింది లేదు. ఎట్టకేలకు ‘ఆచార్య’ ద్వారా ఇన్నాళ్లకు ఈ తండ్రీ కొడుకులిద్దర్ని పూర్తిస్థాయిలో తెరపై చూసుకునే అవకాశం దొరికింది ప్రేక్షకులకు. వాస్తవానికి ఇందులో చరణ్ది కీలక పాత్రే అయినా.. కథ పరంగా ఎంతో ప్రాధాన్యముంది. సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో ఈ తండ్రీ తనయులిద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో చిరు టైటిల్ పాత్రలో కనిపించనుండగా.. సిద్ధ పాత్రలో చరణ్ దర్శనమిస్తారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెబల్ కాంబినేషన్..
కృష్ణంరాజు నట వారసుడిగా వెండితెరకు పరిచయమై.. అనతి కాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. ఆయన ఇప్పటికే ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ రెబల్ హీరోలిద్దరూ ముచ్చటగా మూడోసారి ‘రాధేశ్యామ్’లో కలిసి కనువిందు చేయనున్నారు. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనుండగా.. పరమహంస అనే ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు సందడి చేయనున్నారు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలో కొత్త విడుదల తేదీపై స్పష్టత రానుంది.
ఓటీటీ వేదికపై.. బాబాయ్ అబ్బాయ్
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక. ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఈ బాబాయ్ అబ్బాయ్ల క్రేజీ కాంబినేషన్.. ‘రానా నాయుడు’ రూపంలో కార్యరూపం దాల్చింది. అయితే ఇది వెండితెరపై సందడి చేసే చిత్రం కాదు.. ఓటీటీ వేదికగా అలరించనున్న వెబ్సిరీస్. విభిన్నమైన యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన అమెరికన్ షో ‘రే డోనోవన్’ షో ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. కరన్ అన్షుమన్, సుపర్న్ వర్మ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
తండ్రీ కొడుకుల ‘మహాన్’
‘అపరిచితుడు’, ‘శివ పుత్రుడు’, ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు విక్రమ్. ఆయన తన తనయుడు ధ్రువ్ ‘అర్జున్రెడ్డి’ రీమేక్తో వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తండ్రీ కొడుకులిద్దరూ తొలిసారి ‘మహాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గ్యాంగ్స్టర్స్ మధ్య సాగే ప్రతీకార కథగా ఉంటుంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తనయతో.. రాజ‘శేఖర్’..
కథానాయకుడిగా తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు రాజశేఖర్. ఇప్పుడాయన తొలిసారి తెరపై తన తనయ శివానీ రాజశేఖర్తో కలిసి నిజ జీవిత పాత్రలో సందడి చేయనున్నారు. మరి ఈ తండ్రీ కూతుళ్ల అల్లరి వెండితెరపై ఎలా ఉండనుందో తెలియాలంటే ‘శేఖర్’ విడుదల వరకు వేచి చూడాల్సిందే. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్గా రూపొందింది. ఇందులో రాజశేఖర్, శివాని తండ్రితనయలుగా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్