Tollywood: తెర వారసత్వం
వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది.
2022లోనే అరంగేట్రం
వారసత్వ నటులు చిత్ర పరిశ్రమకు కొత్తేమీకాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నట వారసుల జోరు కనిపిస్తుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త వారసులు వెండితెరకు పరిచయమవుతుంటారు. గతేడాది తెలుగులో వీరి సందడి బాగానే కనిపించింది. మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్, రాజశేఖర్ నట వారసురాలిగా శివానీ తెరపై మెరిసి మెప్పించారు. ఇప్పుడు వీరి బాటలోనే ఈ ఏడాదీ పలువురు నట వారసులు వెండితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నారు. సంక్రాంతికి ఇద్దరు వారసులు రాగా... త్వరలో ప్రేక్షకుల్ని పలకరించడానికి మరికొందరు వస్తున్నారు. వారి చిత్ర విశేషాలేంటో చూసేద్దాం పదండి...
తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది ఆరంభం నుంచే నట వారసుల సందడి కనిపించింది. సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాగా.. అందులో రెండు వారసులకు సంబంధించినవే. వీటిలో ఒకటి ‘హీరో’. ఈ సినిమాతోనే సీనియర్ హీరో కృష్ణ మనవడు, మహేష్బాబు మేనల్లుడైన అశోక్ గల్లా కథానాయకుడిగా తెరకు పరిచయమయ్యారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రమిది. కొత్తదనం నిండిన కమర్షియల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులకు వినోదాలు పంచిచ్చింది. ‘రౌడీబాయ్స్’ చిత్రంతో పెద్ద పండగ బరిలో సందడి చేసిన మరో కొత్త హీరో ఆశిష్. ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడాయన. శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా.. పండగ బరిలో నిలిచి యువతరాన్ని అలరించింది. ప్రస్తుతం ఆశిష్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్లో చేయనున్నారు. సుక్కు శిష్యుడు కాశీ తెరకెక్కించనున్న ఈ సినిమాకి ‘సెల్ఫిష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.
వీళ్లూ ఉన్నారు...
దగ్గుబాటి కుటుంబం నుంచి ఈ ఏడాది మరో కొత్త హీరో వెండితెరకు పరిచయం కానున్నారు. ఆయనే దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు రెండో తనయుడాయన. నటుడు రానాకు సోదరుడు. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాతో.. ఈ ఏడాది తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టనున్నారు అభి. తేజ శైలిలో సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ‘అహింస’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
* ‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా సినీప్రియుల్ని పలకరించనున్నారు బెల్లంకొండ గణేష్. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడాయన. లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. టైటిల్కు తగ్గట్లుగానే స్వాతిముత్యం లాంటి ఓ యువకుడి కథగా ఈ సినిమా సాగనుంది. ఇందులో గణేష్కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
* ‘బేకర్ అండ్ బ్యూటీ’, ‘త్రీరోజెస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి వెబ్సిరీస్లతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించారు సంగీత్ శోభన్. దర్శకుడు శోభన్ తనయుడు, హీరో సంతోష్ శోభన్ సోదరుడైన సంగీత్.. ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాతో వెండితెరపై అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది.
అందరి చూపు.. అటు వైపే
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఎన్నోసార్లు స్పష్టత ఇచ్చారు. ఆయన త్వరలో తెరపైకి వస్తాడని చెబుతున్నారే తప్ప.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో చిత్రసీమకు పరిచయం చేస్తానని బాలకృష్ణ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన దర్శకత్వంలోనే రూపొందనున్నట్లు తెలిపారు. ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు బాలయ్య. కానీ, అదెప్పుడు సెట్స్పైకి వెళ్తుందన్నది ఆయన ఇప్పటికీ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్పై సినీప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల