Nithiin: ‘సినిమాలు వదిలేసెయ్’ అనే విమర్శలూ విన్నా!
పడిలేచిన కెరటానికి నిలువెత్తు నిదర్శనం కథానాయకుడు నితిన్. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు రుచి చూశారాయన. ఆ స్టార్డమ్ను ఆస్వాదించేలోపే వరుస పరాజయాలూ ఎదుర్కొన్నారు.
పడిలేచిన కెరటానికి నిలువెత్తు నిదర్శనం కథానాయకుడు నితిన్. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు రుచి చూశారాయన. ఆ స్టార్డమ్ను ఆస్వాదించేలోపే వరుస పరాజయాలూ ఎదుర్కొన్నారు. ఏడేళ్లకు పైగా పరాజయాలు వెంటాడినా.. ‘ఇష్క్’తో తిరిగి నిలబడ్డారాయన. అప్పటి నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. తన జైత్ర యాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్యలో ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలతో కాస్త తడబడినా.. ‘మ్యాస్ట్రో’తో తిరిగి ట్రాక్ ఎక్కారు. ఇప్పుడాయన ‘మాచర్ల నియోజకవర్గం’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నితిన్.
ఈ చిత్రంతో... ప్రేమకథల నుంచి మాస్ కథల వైపు మనసు మళ్లిందనుకోవచ్చా?
‘‘దీని వెనుక ప్రత్యేకమైన ప్లాన్ ఏమీ లేదు. 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమకథలు చేసీ చేసీ కాస్త బోర్ ఫీలింగ్ వచ్చింది. ఈసారి కాస్త కొత్తగా చేయాలి. నెక్ట్స్ లెవల్కు వెళ్లాలి అన్న ఉద్దేశంతో ఈ కథ ఎంచుకున్నా. మాస్ ఎలిమెంట్స్తో పాటు అన్ని రకాల వాణిజ్య హంగులు ఉన్న కమర్షియల్ చిత్రమిది. చాలా శక్తిమంతమైన పాత్రలో నటించా. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కనుల పండగలా అనిపిస్తుంది’’.
కమర్షియల్ చిత్రాల్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అలాంటి అంశాలు ఏమున్నాయి?
‘‘ఇది కమర్షియల్ చిత్రమైనా.. మేము ఎత్తుకున్న పాయింట్ చాలా వినూత్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఫిక్షనల్ కథతోనే రూపొందింది. ఈ చిత్ర దర్శకుడిది గుంటూరు ప్రాంతం. చిన్నప్పటి నుంచి మాచర్ల పేరు వినీ వినీ ఉన్నాడు. ఆ పేరులో మంచి ఫోర్స్ ఉంది. అందుకే ఆ పేరుతోనే ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్ పెట్టాడు’’.
ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?
‘‘కథలో ఉన్న కొత్తదనమే. దీంట్లో నేను ఐఏఎస్ అధికారిగా కనిపిస్తా. ఈ తరహా పాత్ర నేనింత వరకు చేయలేదు. నిజానికి ఈ కథను ఓ ఐపీఎస్ అధికారి బ్యాక్డ్రాప్లోనూ చెప్పొచ్చు. కానీ, పోలీస్ పాత్రలన్నవి చాలా కామన్. అందుకే ఈ కథను ఓ ఐఏఎస్ అధికారి కోణం నుంచి చెప్పాలనుకున్నాం. సినిమా ప్రథమార్ధమంతా వినోదాత్మకంగా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కథ యాక్షన్ మోడ్లోకి వెళ్తుంది. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్లకూ ఎంతో ప్రాధాన్యముంది. హీరో మాచర్లకు వెళ్లేదే ఓ అమ్మాయి సమస్య తీర్చడానికి. మరి ఆ సమస్య ఏంటి? దాన్ని హీరో ఎలా పరిష్కరించాడు? అన్నది తెరపై చూడాలి. ఇందులో కేథరిన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. కృతి నాకు జోడీగా కనిపిస్తుంది’’.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందనిపిస్తోంది?
‘‘కొవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్థం కావడం లేదు (నవ్వుతూ). ఏ సినిమా చూస్తున్నారు? వస్తున్నారో? సరిగ్గా అర్థం కావట్లేదు. టీజర్, ట్రైలర్లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది అంతే. నాకు తెలిసి కొవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యూమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలే ఎక్కువ ఆడుతున్నాయి’’.
మీకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ప్రస్తుత షూటింగ్స్ బంద్ను ఏ కోణంలో చూస్తారు?
‘‘ఒక నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికి.. చిత్రీకరణలు మొదలవుతాయని ఆశిస్తున్నా. పారితోషికాల విషయంలో అందరూ ఏదంటే.. నాది అదే మాట. నిజానికి దీనిపై నాకంత అవగాహన లేదు. పిలిస్తే షూటింగ్కు వెళ్తాను. యాక్టింగ్ చేస్తాను, అంతే’’.
మీ బ్యానర్లో ‘విక్రమ్’ చిత్రం విడుదల చేశారు. అది చూశాక ఏమనిపించింది?
‘విక్రమ్’ చూశాక వారం రోజులు నిద్ర పట్టలేదు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా.. ఇలా తీయాలి కదా అనిపించింది. కథని బలంగా నమ్మి చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇలాంటి చిత్రాలు చేయడానికి హీరోలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా పాత్ర ఇలాగ ఉంటేనే చేస్తా.. మూడు పాటలుండాలి అని లెక్కలేసుకొని చేస్తే కుదరదు’’.
20ఏళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది? అపజయాల్లో ఉన్నప్పుడు మీకు స్ఫూర్తినిచ్చిందెవరు?
‘‘ఈ సుదీర్ఘ ప్రయాణంలో హిట్స్ చూశా. కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా. ప్రస్తుతం మంచి స్థితిలో ఉండటం తృప్తిగా ఉంది. వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ప్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగుల్ చేసేవాడ్ని (నవ్వుతూ). అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. అయితే ఆ సమయంలో నెట్టింట కొందరు చేసిన విమర్శలు మనసుని తీవ్రంగా బాధించేవి. ‘మహ్మద్ గజనీలా దండయాత్ర చేస్తున్నావు. వేస్ట్.. సినిమాలు వదిలేసేయ్’ అన్న విమర్శలూ విన్నా. అయితే ఆ విమర్శల్నే పాజిటివ్గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను’’.
ఎడిటర్గా ఉన్న రాజశేఖర్ దర్శకత్వం చేయగలడనే నమ్మకం మీకెలా కలిగింది?
‘‘దర్శకుడు రాజశేఖర్ నాకు ‘లై’ సినిమా సమయం నుంచి తెలుసు. ఆయన ఆ చిత్రానికి ఎడిటర్గా పనిచేశాడు. తన ఎడిటింగ్ స్టైల్.. సినిమా విషయంలో తను ఇచ్చే ఇన్పుట్స్ నచ్చి ‘నువ్వు సినిమా చేస్తే బాగుంటుందేమో’ అని చెప్పా. నేను ఆ మాట చెప్పే వరకు తనకు దర్శకత్వం వైపు ఆలోచన లేదు. ఆ తర్వాతే తను ఇటు వైపు దృష్టి పెట్టాడు. కొవిడ్ టైమ్లో ఈ కథ రాసుకొని.. నాకు వినిపించాడు. అది నాకు బాగా నచ్చడంతో వెంటనే చేద్దామని చెప్పా. శేఖర్ స్వతహాగా ఎడిటర్ కావడం వల్ల.. స్క్రిప్ట్లో ఏది ఉంటే బాగుంటుంది? ఏది అవసరం లేదు? అన్నది తనకి స్పష్టంగా తెలుసు. ఒకరకంగా స్క్రిప్ట్ దశలోనే కథ చక్కగా ఎడిట్ అయిపోయింది’’.
‘‘పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదన్నది నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడు అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. మంచి కథ దొరికితే వెబ్సిరీస్ చేయాలన్న ఆలోచనా ఉంది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..