JUGJUGG JEEYO: కుటుంబ కథా చిత్రమిది...

మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ వివాహ బంధంలోని గొప్పతనాన్ని చెప్పడానికి ‘జుగ్‌ జుగ్‌ జియో’ చిత్ర బృందం సిద్ధమైంది. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ మెహతా దర్శకుడు.

Updated : 23 May 2022 07:04 IST

నల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ వివాహ బంధంలోని గొప్పతనాన్ని చెప్పడానికి ‘జుగ్‌ జుగ్‌ జియో’ చిత్ర బృందం సిద్ధమైంది. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ మెహతా దర్శకుడు. జూన్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం జరిగిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంతో ఈ బృందం ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది. రెండు వేర్వేరు తరాలకు చెందిన జంటలు తమ వివాహ బంధంలో వచ్చిన  ఒడుదొడుకులను ఎదుర్కొని ప్రేమను ఎలా గెలుచుకున్నారన్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్‌లో అనిల్‌ - నీతూ, వరుణ్‌ - కియారా జంటలు చేసే అల్లరి అలరించింది. వీరి సందడి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని