ఆ హీరో అంటే క్రష్‌ : రష్మిక

రష్మిక మంథాన ఇటీవల టాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్‌. హీరో నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘భీష్మ’ త్వరలోనే అభిమానుల ముందకు రానుంది. ‘భీష్మ’ ప్రమోషన్‌లో భాగంగా ఓ..

Published : 18 Feb 2020 22:31 IST

చెన్నై: రష్మిక మంథాన ఇటీవల టాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్‌. హీరో నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘భీష్మ’ త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు తమిళ హీరో విజయ్‌ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. ‘చిన్నప్పట్నుంచీ విజయ్‌ సర్ అంటే క్రష్‌ ఉంది. ఆయనతో కలిసి బిగిల్‌ సినిమాలో నన్ను భాగస్వామి కావాలని చాలామంది కోరారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో చేయడం కుదరలేదు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను’ అని ఆమె తెలిపింది.
2016లోనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మికకు అంతగా గుర్తింపు రాలేదు. 2018లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక ఛలో, గీత గోవిందం సినిమాలతో ఈ భామ ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో కనిపించిన  ఆమె ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఆఫర్లు క్యూ కట్టడంతో ఆమె యమ బిజీ అయిపోయింది. త్వరలోనే కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్‌’ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోనూ రంగప్రవేశం చేయనుంది. మరోవైపు అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ రష్మిక హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు