మన హీరోలు ఒక్కొక్కరుగా రావట్లేదుగా..!
కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి ఎంతో శ్రమ కావాలి. ఎన్నో కాస్ట్యూమ్స్, టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. ఏ విధంగా చెప్పాలంటే సినిమా భారం.....
బాలకృష్ణ, రామ్, విక్రమ్..
కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి మరింత కష్టపడాలి. ఎన్నో కాస్ట్యూమ్స్, టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. సినిమా భారం మొత్తం భుజాల మీద వేసుకుని మోయాలి. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాత్రలు, షేడ్స్ పోషించిన హీరోలు చాలా మందే ఉన్నారు. రానున్న రోజుల్లోనూ మన హీరోలు ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో సందడి చేయబోతున్నారు. బాలకృష్ణ, రామ్, విక్రమ్ తదితరులు తమ తర్వాతి ప్రాజెక్టులో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేయబోతున్నారట. వారివైపు ఓ సారి చూద్దాం..
రామ్ రెడ్
‘ఇస్మార్ట్ శంకర్’లాంటి బ్లాక్బస్టర్ తర్వాత రామ్ మరో విభిన్న కథను ఎంచుకున్నారు. కోలీవుడ్లో సూపర్హిట్గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ను ‘రెడ్’ టైటిల్తో రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులకు తన స్టైల్లో అందిస్తున్నారు. ఇందులో ఆయన సిద్ధార్థ్, ఆదిత్యగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన లభించింది. రామ్ రెండు విభిన్న పాత్రల్లో చక్కటి వ్యత్యాసం చూపించారు. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరోమారు..
నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు మరోసారి రెండు పాత్రల్లో కనిపించి, వినోదం పంచబోతున్నారట. ఆయన హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం ఉంది. ఈ చిత్రంలో అంజలి, శ్రియలను కథానాయికలుగా అనుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి. ఒక పాత్రలో అఘోరగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. కరోనా నేపథ్యంలో చిత్ర షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఏకంగా ఏడు..
కథానాయకుడు విక్రమ్ మరోసారి తనలోని ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించారు. కాగా ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. విక్రమ్ ప్రతి పాత్రకీ అద్భుతమైన వ్యత్యాసం చూపించారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది.
ఇద్దరు మహేశ్లు నిజమేనా?
మహేశ్బాబు రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బాషా’ తరహాలో ఈ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఓ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారంటూ టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
ఒకరా? ఇద్దరా?
రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్న కొత్త చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఇటీవలే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాజకీయాంశాలతో ముడిపడిన కథతోనే ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రవితేజా ఒకరా? ఇద్దరా? అనే సందేహం కలిగేలా పాత్ర ఉంటుందట.
వరుసగా..
తమిళ స్టార్ విజయ్కు ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే అనేక చిత్రాల్ల్లో విభిన్న పాత్రల్లో సందడి చేశారు. ‘మెర్సల్’లో మూడు పాత్రల్లో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘విజిల్’లోనూ అలానే మెప్పించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. త్వరలో ఆయన నటించిన ‘మాస్టర్’ చిత్రం రాబోతోంది. ఇందులోనూ విజయ్ రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.