షూటింగ్స్‌కి వెళ్లడం లేదు: సునీత

కరోనా కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తాను ప్రస్తుతం షూటింగ్స్‌కి సైతం వెళ్లడం లేదని ప్రముఖ గాయని సునీత తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా ప్రస్తుతం తాను.....

Updated : 08 May 2021 14:14 IST

ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన గాయని

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తాను ప్రస్తుతం షూటింగ్స్‌కి వెళ్లడం లేదని ప్రముఖ గాయని సునీత తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా ప్రస్తుతం తాను ఇంటికే పరిమితమైనట్లు చెప్పారు. చాలారోజుల తర్వాత ఇన్‌స్టా వేదికగా లైవ్‌లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు కోరిన సుమధురాలను ఆలపించి ఆకట్టుకున్నారు. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో..  ప్రతిఒక్కరికీ కొంత సాంత్వన అందించేందుకే తాను ఈ విధంగా లైవ్‌లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఆమె సూచించారు.

లైవ్‌లో భాగంగా ‘గోదావరి’ నుంచి ‘అందంగా లేనా’, ‘రామచక్కని సీతకు’, ‘తమ్ముడు’ నుంచి ‘పెదవిదాటని’తోపాటు తెలుగు, తమిళం, కన్నడ పాటలను ఆమె పాడి వినిపించారు. అనంతరం ఎస్పీబాలు గురించి మాట్లాడుతూ.. ‘పాడిన ప్రతి పాట, ఆసమయంలో చోటుచేసుకున్న ప్రతి విషయం ఆయనకు గుర్తుందంటే దానర్థం.. ఆయన ప్రతి క్షణం పాటలోనే జీవించారు. పాటల్నే ప్రేమించారు’ అని సునీత కొనియాడారు. అలాగే చిత్ర.. భారతదేశంలోనే గొప్ప గాయని అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘నేనున్నానని’ పాట పాడి.. దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు వివరించారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని