SSMB 28: మహేశ్‌- త్రివిక్రమ్‌ సినిమాలో మరో హీరో.. ఈ ఇద్దరిలో ఎవరో?

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Published : 21 May 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్‌- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందని, దాని కోసం దర్శకుడు మరో హీరోను ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సుశాంత్‌ను సంప్రదించినట్టు టాక్‌. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌ ముఖ్య భూమిక పోషించారు. ఆయన నటనను మెచ్చిన త్రివిక్రమ్‌ మరోసారి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు, నాని పేరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహేశ్‌ సినిమాలో నాని కనిపించబోతున్నాడంటూ అంతా చర్చించుకుంటున్నారు. దాంతో ఈ సినిమా ట్విటర్‌ ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో మహేశ్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనుంది. సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు ‘పార్థు’ అనే పేరు ప్రచారంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని