Jai Bhim: ఆస్కార్ బరిలో ‘జైభీమ్’.. ‘మరక్కర్’
అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్ పురస్కారాల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్లిస్ట్) 276 చిత్రాలను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్’, మోహన్లాల్ ‘మరక్కర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
షార్ట్లిస్ట్లో స్థానం
వరుసగా రెండో ఏడాది సూర్య చిత్రం
అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్ పురస్కారాల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్లిస్ట్) 276 చిత్రాలను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్’, మోహన్లాల్ ‘మరక్కర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఈ మొత్తం సినిమాలకు సంబంధించిన జాబితాను ఆస్కార్ అకాడమీ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా’) గతేడాది ఆస్కార్ రేసులో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘జై భీమ్’ ద్వారా వరుసగా రెండో ఏడాది ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. తా.సే.జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రమిది. జస్టిస్ చంద్రు జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో రూపొందించారు. ఇందులో సూర్య గిరిజన హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా చంద్రు పాత్రలో కనిపించి మెప్పించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది.
* ఆస్కార్ షార్ట్లిస్ట్లో ‘జైభీమ్’తో పాటే నిలిచిన మరో భారతీయ సినిమా మోహన్లాల్ ‘మరక్కార్’. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమైన చిత్రమిది. కుంజలి మరక్కర్-ఖిజు జీవిత కథతో ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా.. విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులు (ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైన్) గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఫిబ్రవరి 8న తుది జాబితా
ప్రస్తుతం ఆస్కార్కు షార్ట్లిస్ట్లో నిలిచిన వాటిలో ‘స్పైడర్మ్యాన్ : నో వే హోమ్’, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బీయింగ్ ద రికార్డస్’, ‘బెల్ఫాస్ట్’, ‘కోడా’, ‘డ్యూన్’, ‘ఎన్ కాంటో’, ‘హౌస్ ఆఫ్ గస్సీ’, ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’, ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్2’, ‘స్పెన్సర్’ తదితర చిత్రాలున్నాయి. కాగా, తుది జాబితాకు ఎంపికైన సినిమాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. మార్చి 27న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం