Jeevitha Rajasekhar: తప్పు చేస్తే నడిరోడ్డుపై నిల్చోబెట్టి కొట్టాలి: సినీనటి జీవితా రాజశేఖర్
సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై వచ్చే కథనాలు మరెవరిపైనా ఉండవని సినీనటి జీవితా రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబం ఎవరినైనా మోసం చేయడం చూశారా? అని ప్రశ్నించారు. నటీనటులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఫిలిం ఛాంబర్ సభ్యులు హైదరాబాద్ ఫిలింఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో సినీ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా జీవిత మాట్లాడుతూ అసత్య కథనాలపై మండిపడ్డారు. తనకీ ఓ కుటుంబం ఉంటుందని.. ఇలాంటి వార్తలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?
‘‘ఇండస్ట్రీ ముఖ్యంగా మీడియా వాళ్లు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా షూటింగ్స్, ఇతర పనులు ఇలా మా కుటుంబం మొత్తం మా పనుల్లోనే ఎప్పుడూ బిజీగా ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటాను. ఇలా ఉన్నప్పటికీ మా కుటుంబం గురించి వచ్చినన్ని అసత్య వార్తలు మరెవరి మీద రాలేదు. నేను ఎవరికైనా అన్యాయం చేయడం చూశారా?.
ఆ కేసు కోర్టులో నడుస్తోంది.. నిజానిజాలు వస్తాయి
ఇటీవల ‘గరుడవేగ’ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ మాపై ఎన్నో ఆరోపణలు చేశారు. సినిమాకి వాళ్లు కొంత మొత్తమే ఖర్చుపెట్టారు. మిగతాది మేము ఆస్తులమ్ముకుని మరీ డబ్బు తీసుకువచ్చి సినిమా కోసం ఖర్చు పెట్టాం. కానీ, రిలీజ్ అయ్యాక.. సినిమాకి వచ్చిన డబ్బు మొత్తం వాళ్లే తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్లు ఇటీవల మీడియా ముందుకు వచ్చి ‘జీవిత రాజశేఖర్ రూ.26 కోట్లు మాకు ఎగ్గొట్టారు. మోసం చేశారు’ అని ఆరోపణలు చేశారు. ఆ వార్తలను మీడియా నాలుగు రోజులుపాటు ప్రసారం చేసింది. దానిపై నేను ఆయా మీడియా వాళ్లని అడగాను. ‘కోటేశ్వరరాజు, హేమ మాకు బ్లాంక్ చెక్ చూపించారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయి.
అలాంటి వార్తలతో 25 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నా..
అంతేకాకుండా ఇటీవల నా కుమార్తెలపై ఏవేవో వార్తలు రాశారు. నా కుమార్తె వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా కొంతమంది థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు సృష్టించారు. ఇలాంటి వార్తలు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని మీడియా హౌస్లు మాత్రమే ఇలా చేస్తున్నాయి. దయచేసి, మా కష్టాలను అర్థం చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేశామో లేదో నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేశామని రుజువైతే నడిరోడ్డుపై మమ్మల్ని నిలబెట్టి కొట్టండి. ఇలాంటి అసత్య వార్తల వల్ల గత 25 ఏళ్ల నుంచి నేను ఎంతో ఇబ్బందిపడుతున్నా. లీగల్ పోరాటం చేయొచ్చు కానీ, అంత సమయం, డబ్బు అందరి దగ్గరా ఉండదు. మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
ఆ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు
ఇటీవల ‘శేఖర్’ ప్రమోషన్స్లో భాగంగా నా కుమార్తెలతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నేను ఓ నానుడి వాడితే.. దాన్ని వేరేలా అర్థం చేసుకుని ఆర్యవైశ్య వర్గం వారిని కించపరిచినట్లు వార్తలు వచ్చాయి. దానిపై చర్చా సమావేశం కూడా చేశారు. ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నా మాటలతో ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించండి’’ అని జీవిత అన్నారు.
పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యం: ఆదిశేషగిరిరావు
అనంతరం ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ఓటీటీ వచ్చాక వంద సమస్యలు మొదలయ్యాయని.. వాటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రమే యూట్యూబ్లో పైరసీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలింఛాంబర్ యాంటీ పైరసీ విభాగం ఇతరుల చేతుల్లో ఉందని.. డబ్బున్నవాళ్లకే యాంటీ పైరసీ సెల్ పనిచేస్తోందని ఆరోపించారు. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యం. నిర్మాత మండలికి కట్టుబాట్లు లేకుండా పోయాయి. నిర్మాతల మండలిలో చేసే తీర్మానాలు వేరు.. బయట జరిగేవి వేరు. నిర్మాతల మండలి కొంతమంది చేతుల్లోకి వెళ్లింది. ఓటీటీపై కూడా కేంద్రం సెన్సార్స్ ఉండాలి. కేన్స్ చలన చిత్రోత్సవానికి హైదరాబాద్ నుంచి ఒక్కరూ వెళ్లలేదు’’ అని ఆదిశేషగిరిరావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి మాట్లాడుతూ.. తాను నటించిన ఓ సినిమా నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. -
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్