Saipallavi - Lovestory: రీమేక్ అని నో చెప్పలేదు.. ఆ భయంతోనే చెప్పా!
‘లవ్స్టోరి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడారు.
‘వచ్చిండే, మెల్లమెల్లగా వచ్చిండే’ అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ‘సారంగదరియా’తో యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులిపిన నటి సాయిపల్లవి. నటనతో, నాట్యంతో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ దూసుకెళ్తోంది. నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన ‘లవ్స్టోరి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.
శేఖర్ కమ్ముల ఫోన్ చేయగానే సినిమాను అంగీకరించారట? డైరెక్టర్ ఆయనని అంగీకరించారా?లేక స్క్రిప్ట్ నచ్చి చేశారా?
సాయిపల్లవి: శేఖర్ కమ్ముల ఫోన్ చేసి కథ నీకు నచ్చిందా? అని అడిగారు. నేను మనసులో ముందే ఒకే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. కథ కూడా విపరీతంగా నచ్చింది. ‘లవ్స్టోరి’ ఒప్పుకోడానికి శేఖర్తోపాటు, స్క్రిప్ట్ కూడా ముఖ్య కారణమే.
భానుమతి, మౌనిక పాత్రలకు తేడా ఏంటి?
సాయిపల్లవి: రెండు పాత్రల నేపథ్యాలు వేరు. వాటి ప్రయాణాలు వేరు. పెళ్లయ్యాక అమ్మాయిలే ఇళ్లు విడిచి ఎందుకెళ్లాలని ‘ఫిదా’లో భానుమతి ప్రశ్నిస్తుంది. మౌనికది మరో రకమైన పోరాటం. ప్రపంచమంతా ఏదీ సాధించలేవని అంటున్నా, చేసి చూపిస్తానని ధైర్యంగా ముందుకెళ్లే అమ్మాయి. జీవితాన్ని గెలవడానికి అద్భుతమైన ప్రతిభ ఉండాల్సిన అక్కర్లేదు. సంకల్పబలం ఉంటే చాలని చూపించే పాత్ర.
పూర్తిగా డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిందా?
సాయిపల్లవి: డ్యాన్స్ ఇందులో ఒక భాగం మాత్రమే. పూర్తిగా దాని చుట్టూ తిరిగే కథ మాత్రం కాదు. సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణేమీ తీసుకోలేదు. శేఖర్, ఆనీ మాస్టర్లతో రిహార్సల్స్ మాత్రం చేశాను.
నిజజీవితంలో ఎప్పుడైనా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నారా?
సాయిపల్లవి: అమ్మాయిలకు ఇలాంటి వివక్ష ఎదురు కాలేదంటేనే ఆశ్చర్యపడాలి. మా అమ్మ, చెల్లి, ఫ్రెండ్స్ ఇలా అందరికీ ఇవి జరిగాయి. నిజానికి ఈ వివక్ష ఎక్కువగానే ఉంది. అమ్మాయిలకు ఇవి సాధరణమే, బయటకు చెప్పాల్సిన అవసరమేంటనే భావన జనాల్లో ఇంకా ఉంది. ఇప్పుడిప్పుడే సమాజం దీని గురించి మాట్లాడుతోంది. ఇలాగే వెళ్తే వందేళ్ల తర్వాత కొంత మార్పు రావచ్చేమో.
సెట్స్లో ఎక్కువ అమ్మాయిలు ఉండటం వల్ల ఏదైనా మార్పు కనిపించిందా?
సాయిపల్లవి: కళకు లింగభేదం ఏమి ఉండదు. అబ్బాయైనా, అమ్మాయైనా ఒకే రకంగా కృషి చేస్తారు. లవ్స్టోరిలో టెక్నీషియన్స్ ఎక్కువగా అమ్మాయిలు ఉండటం వల్ల పనితీరులో కొంత మార్పైతే కనిపించింది.
రీమేక్స్ చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారా?
సాయిపల్లవి: అలాంటి రూల్ ఏమీ పెట్టుకోలేదు. కానీ రీమేక్ చిత్రాలంటే కొంచెం భయముంది. మాతృక స్థాయిలో చేయాలి, లేదా అంతకన్నా కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఒత్తిడి ఉంటుంది. రీమేక్ సినిమా అని నో అని చెప్పలేదు. అందులోని పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది.
పెద్ద హీరోలకు నో చెప్పడానికి చాలా ధైర్యం కావాలి కదా?
సాయిపల్లవి: సినిమాను అంగీకరించి సెట్లోకి వెళ్లాక ఇబ్బందిపడితే బాగోదు కదా. వాస్తవానికి అంగీకరించడానికే ఎక్కువ ధైర్యం కావాలి. మనం ఆ పాత్రకు సరిపోమని నిజాయతీగా చెబితే వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు.
‘పావకథైగళ్’ ఇలాంటి నేపథ్యంలోనే వచ్చింది. ఈ రెండు సినిమాలకు తేడా?
సాయిపల్లవి: సినిమాపరంగా సమాజం కోసం కొన్ని సార్లు ఏదైనా చేయాలనిపించినా, అలాంటి అవకాశం మాత్రం తక్కువ సార్లు వస్తుంది. ఇప్పటిదాకా అమ్మాయిని బాధితురాలిగా చూపించినవే సినిమాలు ఎక్కువగా వచ్చాయి. సమస్యలను అధిగమించి ఆ ప్రయాణాన్ని ఎలా కొనసాగించిందనేది శేఖర్ కమ్ముల ఇందులో కమర్షియల్గా చూపించారు. ఇక ‘పావకథైగళ్’ తండ్రీకూతుళ్ల మధ్య జరిగే 30 నిమిషాల చిన్న కథ. అత్యాచారాల గురించి తెలిసినప్పుడు లోపల ఒకరకమైన బాధ ఉండేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. నా వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వీటిని అంగీకరించాను.
శేఖర్ కమ్ములతో పనిచేసిన తర్వాత మీలో వచ్చిన మార్పేంటి?
సాయిపల్లవి: నేను ఇదివరకన్నా సున్నితంగా మారిపోయాను. ఆయన ఎక్కడైనా సాధారణంగానే ఉంటారు. నేల మీదే కూర్చొని పనిచేస్తారు. అలాంటి సాధారణ జీవితాన్ని నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఏదైనా తప్పు జరిగితే ధైర్యంగా అడగమంటారు. మనం బాధపడిన విషయం వారికి తెలియాలంటే పోరాడక తప్పదని చాలా సార్లు చెబుతుంటారు.
అవుట్డోర్ షూటింగ్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది?
సాయిపల్లవి: నేను తెలుగు అమ్మాయిలానే ఫీల్ అవుతాను. ‘ఫిదా’ కోసం బాన్సువాడ, ఇప్పుడు ఆర్మూర్ దగ్గర పిప్రీలో చేశాం. అక్కడి జనం హీరోహీరోయిన్లనే తేడా లేకుండా మాతో మాట్లాడారు. కొవిడ్ సమయంలో, రాత్రిపూట షూటింగ్ జరిగినా విసుక్కోలేదు. దగ్గర కూర్చొని చేయిపట్టుకుని ప్రేమగా మాట్లాడతారు. చిన్నచిన్న విషయాలు అడిగి తెలుసుకుంటారు. బాన్సువాడలో ఓ స్థానిక డిజైనర్ చీరను కూడా కానుకగా ఇచ్చారు. గ్రామాలకు వెళ్తే అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత ప్రేమగా ఉంటారు.
‘శ్యామ్సింగరాయ్’, ‘విరాట పర్వం’ ఎప్పుడొస్తాయి?
సాయిపల్లవి: ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. డబ్బింగ్, గ్రాఫిక్స్ పనులు మిగిలున్నాయి. పూర్తి కావడానికి ఇంకొంచెం సమయం పట్టొచ్చు. ‘విరాటపర్వం’ కూడా దాదాపు పూర్తయింది. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి.
మీతో డ్యాన్స్ చేయడానికి చైతన్య ఇబ్బందిపడ్డారా?
సాయిపల్లవి: అదేం లేదు. నాగచైతన్యకు స్టైల్ లోపలే ఉంది. నాకు డ్యాన్స్ బాగా వచ్చు కాబట్టి ఇలా అనిపిస్తుంది. నేను చైతులా ఫైట్స్ చేయమంటే చేయలేను కదా. నిజానికి ‘లవ్స్టోరి’లో చాలా బాగా డ్యాన్స్ చేశాడు. రేవంత్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. చైతు పక్కన నటించడం చాలా సౌకర్యంగా అనిపించింది.
డ్యాన్స్లో కష్టపడిన సందర్భాలు?
సాయిపల్లవి: డ్యాన్స్ చేసేటప్పుడు నాకు ఎదురుగా ఎవరూ కనిపించారు. హీరో ఎవరనేది కూడా పట్టించుకోను. ‘రౌడీ బేబీ’, ‘ఏవండో నాని గారు’ పాటలు షూట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అలాంటి కష్టం లేకుండా చేస్తే మంచి ఫలితాలు రావు.
మీతో డ్యాన్స్ చేయడం కష్టమని చిరంజీవి గారు కామెంట్ చేశారు? దానికి మీరేమంటారు?
సాయిపల్లవి: చిరంజీవిగారు పెద్ద మనసుతో అలా అన్నారు. కళపై వారికున్న అభిమానం అలాంటిది. కానీ నాకన్నా ఇంకా బాగా చేసేవారున్నారు. నేనైతే గొప్ప డ్యాన్సర్నని భావించను. నా డ్యాన్స్ చూసి సంతోషపడితే చాలు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి?
సాయిపల్లవి: తెలుగులో రెండు చిత్రాలున్నాయి. తమిళం, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేయాలి. ఓటీటీ కోసం కథ వింటున్నాను. ఇంకా ఓకే చెప్పలేదు, కానీ కాన్సెప్ట్ బాగుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే