Love story: కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది..కానీ దాని గురించి పట్టించుకోం..
‘లవ్స్టోరీ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఫీల్గుడ్ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్పై ప్రత్యేక ముద్రవేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ ఇలా ఆయన సినిమాలన్నీ ప్రత్యేకమైన శైలిలో కొనసాగుతాయి. మరోసారి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య తొలిసారి నటించిన ‘లవ్స్టోరి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘లవ్స్టోరి’ కూడా నా గత చిత్రాల్లాగే ఫీల్గుడ్ మూవీ. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే మంచి ప్రేమకథతోపాటు సమాజంలోని ఓ ప్రధాన సమస్యను చూపించాం. అందుకే నా మిగతా చిత్రాలతో పోలిస్తే ఇది మరో స్థాయిలో ఉండే సినిమా. ఇందులో రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. నాగచైతన్య అణగారిన వర్గం నుంచి వచ్చిన యువకుడి పాత్రలో నటించాడు. సమాజంలో ఉండే కుల సమస్యతో పాటు స్త్రీ పట్ల ఉండే వివక్షను తెరపై చూపించే ప్రయత్నం చేశాను. ‘లీడర్’లో అవినీతి గురించే ఎక్కువ చర్చించాం. అంటరానితనం మీద అందులో కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ సినిమా నుంచే కులవివక్ష మీద ఏదైనా తీయాలనే ఆలోచన మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇప్పుడు ‘లవ్స్టోరి’కి తగిన కథ కుదిరింది. సమాజంలో కుల వివక్ష తప్పకుండా ఉంది. లేదనడం సరికాదు. అవి మన దృష్టికి రావు. ప్రస్తుత సమాజంలో వెతుక్కుంటే ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. సినిమాలు, మీడియా ద్వారా వాటిని చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సమస్యను సంపూర్ణంగా చూపించానని చెప్పలేను. కానీ, సాధ్యమైనంత వరకూ దాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశాను. వాస్తవానికి కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది. మనం దాని గురించి మాట్లాడుకోం, స్పందించే ప్రయత్నం చేయం.
ఒత్తిడిగానే ఉంది
‘లవ్స్టోరి’ షూటింగ్ 30 రోజుల్లో పూర్తవుతుందనగా కొవిడ్ వచ్చింది. సంవత్సరం తర్వాత చిత్ర యూనిట్ అందరికీ బీమాలు చేయించి, పీపీఈ సూట్లు ఇప్పించి కొవిడ్ నిబంధనలతో షూటింగ్ మళ్లీ మొదలుపెట్టాం. మూడింతలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అంతలోనే మళ్లీ సెకండ్ వేవ్ దెబ్బ పడింది. వేరే నిర్మాతలైతే ఓటీటీకి వెళ్లేవారే. మా నిర్మాత నారాయణదాస్ మాత్రం ఏదీ ఏమైనా థియేటర్లలలోనే విడుదల చేస్తామన్నారు. అది మాకు గొప్ప బలాన్నిచ్చింది. ఈ ప్రక్రియలో ఎన్నో అడ్డంకులను, లెక్కలను అధిగమిస్తూ చివరకు 24న వస్తున్నాం. వారం నుంచి చిత్రపరిశ్రమ కూడా మా సినిమా కోసం ఎదురుచూస్తోంది. మళ్లీ థియేటర్లు పుంజుకుంటాయని అంతా ఆశాభావంగా ఉన్నారు. నాకు ఇది ఒక రకంగా ఒత్తిడే. కథాంశం పరంగా అందరినీ మెప్పించాలి. కరోనాను అధిగమించి మా సినిమా ఆడాలి.
చైతూ చాలా కష్టపడ్డాడు
తెలంగాణ యాసను పట్టుకునేందుకు నాగచైతన్యతో పాటు, మా టీమంతా కష్టపడ్డాం. షూటింగ్, డబ్బింగ్ సమయంలో ప్రతి పదాన్ని చెప్పించి మా శక్తిమేర ప్రయత్నం చేశాం. గత చిత్రాలకు భిన్నమైన మ్యానరిజం,లుక్లో కనిపిస్తాడు. మొదటి నుంచి డ్యాన్స్లో కష్టపడాలని చైతూ చెబుతుండేవాడు. శేఖర్, అనీ ఇద్దరూ మంచి శిక్షణనిచ్చారు. ‘లవ్స్టోరి’ కోసం హీరో చైతూ చాలా కష్టపడ్డారు. మమ్మల్ని నమ్మి వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇచ్చి మాతో ప్రయాణం చేశాడు. మీరు కచ్చితంగా కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి నటి. ‘ఫిదా’లో చేసింది కాబట్టి తనెలా నటిస్తుందో నాకు తెలుసు. ‘ఫిదా’లోని భానుమతికి, ‘లవ్స్టోరి’లో ఆమె పోషించిన పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఇందులో మరింత పరిణతి ఉన్న పాత్ర ఆమెది. చాలా కష్టపడి చేసింది. ఆమెను మరింత కొత్తగా చూపించేందుకు కష్టపడ్డాం. చైతూ తల్లిగా ఈశ్వరీరావు అద్భుతంగా నటించారు. తల్లీకొడుకులుగా వాళ్లిద్దరికీ చాలా బాగా కుదిరింది. రాజీవ్ కనకాల, ఉత్తేజ్, దేవయాని, ఆనంద చక్రపాణి అందరూ బాగా నటించారు. నా ఉద్దేశంలో మా సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఎక్కువవుంటారు. మళ్లీ మళ్లీ చూస్తారనే నమ్మకముంది.
కళ్లలో నీళ్లు తిరిగాయి
అమిర్ఖాన్కు ట్రైలర్ పంపించాం. ఆయనకు తెగ నచ్చింది. ప్రీ రిలీజ్ వేడుక ఉందని చెప్పగానే ఆయనే వస్తానన్నారు. ఎప్పటికైనే అమిర్ఖాన్కు కథ చెప్పి ఒప్పిస్తాననే నమ్మకం చాలా రోజుల నుంచి ఉండేది. కానీ ప్రస్తుతానికి నేను తెలుగు సినిమాలకే పరిమితమయ్యాను. ఆయన కోసం ప్రత్యేకంగా సినిమా చూపించమన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ‘లవ్స్టోరి’ని సొంత సినిమాలా భావించారు. ఆయన్ను చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. వీరిద్దరి కృషితో మా సినిమా మరో స్థాయికి వెళ్లింది. నా సినిమాల నిడివి ఎక్కువగానే ఉంటుంది. పాత్రలను బాగా ప్రేమించి రాస్తాను. వాటిని ఇంకా ఎక్కువ చెప్పాలనే తాపత్రయముంటుంది. మిట్టపల్లి సురేందర్ రాసిన పాటలో హైదరాబాద్లోని చారిత్రక చిహ్నాలను చూపించాం. భాగమతి కోసం మహమ్మద్ కులీకుతుబ్షా పురానాపూల్ను కట్టించారు. ప్రేమకోసం వంతెన కట్టి దానికి పురానాపూల్ అని పేరు పెట్టారు. అలాంటి చరిత్ర మనది. ఏ ఫిల్మ్ మేకర్ అయినా చరిత్రలో నిలిచిపోవాలనే సినిమాలు తీస్తారు. ప్రతి సన్నివేశం, పాటను ఇంకెవరు తీయలేరు అన్నట్టుగానే ప్రయత్నిస్తారు. ‘లవ్స్టోరి’ని పదేళ్ల తర్వాత చూసిన గర్వంగా అనిపించాలి. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పలేను. కానీ, అలా నిలవాలనే ఆశ మాత్రం ఉంది. ‘ప్రేమ్ నగర్’తో పోల్చడం సంతోషమే. ‘లవ్స్టోరి’ ఆ సినిమా స్థాయిలో 30 శాతానికి చేరినా చాలు.
పరిష్కారాలు చూపలేదు
చిన్న ఊళ్లలో నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చే వారి కథను నిజాయతీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాను. సినిమాలు చూసి మార్పు వస్తుందనేది మన చేతుల్లో ఉండదు. మనం కూడా అలా కావచ్చు అనే ఆలోచనను కలిగించగలిగితే నా జన్మ ధన్యమైనట్టే. అమ్మాయిలు కూడా ఇది మా కథ అని స్ఫూర్తి పొందితే మేం విజయం సాధించినట్లే. నాకు తెలిసింది, నాకు వచ్చింది నిజాయితీగా చెప్పే ప్రయత్నం మాత్రం చేశాను. వేల సంవత్సరాల నుంచి ఈ కులసమస్య ఉంది. పరిష్కారాలు ఎవరు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. దానిపై మనం ప్రశ్న కూడా వేసుకోం. నిర్భయ తర్వాత ఎన్ని ఘటనలు జరగలేదు? వీటికి అలవాటు పడుతున్నామనే భయం పట్టుకుంది. అవి మన జీవన విధానమైపోయింది. ఒకటో తరగతి పుస్తకం మొదటి పేజీలోనే మనమంతా ఒకటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఎన్ని ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకెంత సాహిత్యం కావాలి?
ధనుష్తో వచ్చే ఏడాది
తదుపరి చిత్రం ధనుష్తో చేస్తున్నాను. అది ప్రేమకథ మాత్రం కాదు. ఒక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. నా కథలు మిగతా భాషల్లోనూ వర్కౌట్ అవుతాయని నమ్ముతాను. హిందీలోనూ ధనుష్కు మంచి మార్కెట్ ఉంది. అందుకే తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు సినిమాను అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. వచ్చే ఏడాది ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ‘లీడర్’ సీక్వెల్ తప్పకుండా చేస్తా. అవే పాత్రలుంటాయి. కచ్చితంగా రానాతోనే చేస్తాను. ‘లీడర్’ కథకు అక్కడే ముగింపు పడింది. కథాపరంగా మాత్రం అది సీక్వెల్ కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM