MaheshBabu: వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. వెళ్లారు..!

సమ్మర్‌ సెన్సేషనల్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన నటించిన ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ‘పోకిరి’ తర్వాత...

Published : 22 May 2022 15:10 IST

హైదరాబాద్‌: సమ్మర్‌ సెన్సేషనల్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన నటించిన ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ‘పోకిరి’ తర్వాత అదే స్థాయిలో మహేశ్‌ నుంచి సినిమా రావడంతో సూపర్‌స్టార్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. మరోవైపు ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఫ్యామిలీతో కలిసి సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయడానికి మహేశ్‌బాబు తాజాగా విదేశాలకు వెళ్లారు. కుటుంబంతో కలిసి యూరప్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

ఇంతకుముందు ‘సర్కారువారి పాట’ షూటింగ్‌ పూర్తైన వెంటనే మహేశ్‌.. కుటుంబంతో కలిసి కొన్నిరోజులపాటు పారిస్‌కు వెళ్లి వచ్చారు. మినీ టూర్‌ని ముగించుకుని వచ్చిన వెంటనే ఆయన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ‘‘వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. మళ్లీ వెళ్లారు’’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మహేశ్‌ తన తదుపరి సినిమా పనుల్లో బిజీ కానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని