NTR: ఫ్యాన్స్‌కు తారక్‌ బహిరంగ లేఖ

అభిమానులకు ఎన్టీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం...

Published : 19 May 2021 10:49 IST

హైదరాబాద్‌: అభిమానులకు ఎన్టీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని.. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని పేర్కొన్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌.. కొరటాలశివతో ఓ సినిమా పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని