Manchu Vishnu: ఆ వార్తలకు చెక్‌ పెట్టిన మంచు విష్ణు.. ఇదిగో సాక్ష్యం!

మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో(మా) విజయం సాధించి అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా,

Updated : 07 Dec 2022 16:26 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో(మా) విజయం సాధించి అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా,  హరియాణ గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మంచు విష్ణు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైన పక్క పక్కనే కూర్చొన్న పవన్‌-విష్ణులు మాట్లాడుకోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. విష్ణు పక్కనే ఉన్నా పలకరించడానికి పవన్‌ సుముఖత వ్యక్తం చేయలేదని, విష్ణు పలకరించడానికి ప్రయత్నిస్తే పవన్‌ ముఖం తిప్పుకొని వెళ్లిపోయారంటూ పలు వార్తలు వచ్చాయి. వీటిని మంచు విష్ణు టీమ్‌ ఖండిస్తూనే ఉంది. తామిద్దరం మాట్లాడుకొన్నామని విష్ణు స్వయంగా చెప్పారు. తాజాగా ఇదిగో సాక్ష్యం అంటూ వీడియోను పంచుకున్నారు. ‘అలయ్ బలయ్‌’కి వచ్చిన పవన్‌-విష్ణు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురు కొద్ది సేపు మాట్లాడుకోవటం కనిపించింది. ఈ వీడియోతో సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు మంచు విష్ణు చెక్‌ పెట్టినట్లైంది!

అందరూ జోకర్స్‌..: ‘మా’పై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘‘జోకర్స్‌తో నిండిన సర్కస్‌ సిని‘మా’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై మంచు మనోజ్‌ స్పందిస్తూ, ‘మీరు రింగ్‌ మాస్టర్‌ సర్‌’ అంటూ సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని