Dhee 13: బావా మరదళ్లుగా ప్రియమణి-ఆది

 ‘‘ఇది డ్యాన్సా. నువ్వు చేసింది డ్యాన్సేనా?’’  అని డ్యాన్స్ కంటెస్టెంట్ పండుపై సీరియ‌స్ అయ్యారు ప్రియ‌మ‌ణి.

Published : 18 Jun 2021 17:25 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘‘ఇది డ్యాన్సా. నువ్వు చేసింది డ్యాన్సేనా?’’ అని డ్యాన్స్ కంటెస్టెంట్ పండుపై సీరియ‌స్ అయ్యారు ప్రియ‌మ‌ణి. ప్రియ‌మ‌ణి, పూర్ణ‌ న్యాయ నిర్ణేత‌లుగా ఈటీవీలో ‘ఢీ 13: కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్’ రియాలిటీ షో ప్ర‌సార‌మ‌వుతోన్న సంగతి తెలిసిందే. కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో శ్రావ‌ణ్ ‘అదుర్స్’ చిత్రంలోని ‘శివ శంభో’ పాట‌కి డ్యాన్స్ చేసి మెప్పించాడు. ‘సూప‌ర్’ సినిమాలోని ‘ముద్దులెట్టి చెరిపేయ్’ పాట‌కి స్టెప్పులేసి సంద‌డి చేశాడు పండు.  ఏమైందో ఏమో కానీ పండు ప్రదర్శన ప్రియ‌మ‌ణికి న‌చ్చ‌లేదు. ‘ఏంటి పండు ఏం చేశావ్ ఇక్క‌డ‌. నువ్వు చేసింది డ్యాన్సా?’ అని ప్ర‌శ్నించింది. ఈ స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ పెంచింది.

మరోవైపు ప్రియ‌మ‌ణి- హైప‌ర్ ఆది, పూర్ణ‌- సుడిగాలి సుధీర్ జోడీలు కామెడీతో అలరించాయి. ఆదిని ప్రియమణి బావా అంటూ పిలవడం, వారిద్దరూ విహారయాత్రకు వెళ్తే, సుధీర్‌-పూర్ణ జోడీ రావటం తదితర సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వీళ్ల న‌వ్వుల్ని చూసేందుకు, పండుపై ప్రియ‌మ‌ణి సీరియ‌స్ అవ‌డానికి కార‌ణం తెలుసుకునేందుకు, ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అయ్యారనే ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం బుధ‌వారం (జూన్ 23) రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రోమో చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని