Shahid kapoor:సినిమా చివర్లో ఏడ్చేశా..
అటు బాలీవుడ్లోనే కాదు.. ఇటు టాలీవుడ్లోనూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జెర్సీ’. 2019లో తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’.. ఈ ఏడాది డిసెంబర్ 31న అదే పేరుతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక.
‘జెర్సీ’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో షాహిద్ కపూర్
ఇంటర్నెట్ డెస్క్: అటు బాలీవుడ్లోనే కాదు.. ఇటు టాలీవుడ్లోనూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జెర్సీ’. 2019లో తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’.. ఈ ఏడాది డిసెంబర్ 31న అదే పేరుతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెర్సీ సినిమా ముచ్చట్లతో పాటు పలు ఆసక్తికర విషయాలను ఇలా పంచుకున్నారు.
నన్ను ట్రోల్ చేసినా.. కెరీర్లోనే పెద్ద హిట్ అయ్యింది
రెండేళ్ల క్రితం బాలీవుడ్లో వచ్చిన కబీర్ సింగ్ (తెలుగులో ‘అర్జున్ రెడ్డి’) నా కెరీర్లోనే గొప్ప విజయంగా నిలిచింది. అందులో నటించిన కొన్ని సన్నివేశాలకు నన్ను ట్రోల్ చేశారు. మొత్తానికి ఆ సినిమా మాత్రం మంచి హిట్గా నిలిచింది. 18 ఏళ్ల నుంచి సినీ ఇండస్ర్టీలో ఉన్న నేను.. ఇన్నేళల్లో ఎప్పుడూ అంత కలెక్షన్స్ను అందుకోలేదు. ఇదంతా జరిగినప్పుడు నాకు ఎటువెళ్లాల్లో కూడా అర్థం కాని పరిస్థితి. అంతా కొత్తగా అనిపించింది. ఆ తరువాత అందరూ యాక్షన్ సినిమాలు చేయమని సలహా ఇచ్చారు. కానీ కబీర్ సింగ్ విడుదల ముందు నాని జెర్సీ చూశా. సినిమా చివర్లో ఏడ్చేశా. ఎందుకు అలా ఎమోషనల్ అయిపోయారంటూ నా భార్య నన్ను అడిగింది. ఎందుకంటే జెర్సీ కథ నన్ను అంతలా కదిలించింది. అప్పుడే ఈ సినిమా చేయాలని నిశ్చయించుకున్నా.
కబీర్ సింగ్ కన్నా ముందే జెర్సీ అవకాశం !
కబీర్సింగ్ కన్నా ముందు నాకు జెర్సీ అవకాశం వచ్చింది. అప్పుడు ఈ చిత్రాన్ని చేయకూడదనుకున్నా. ఈలోపు నేను కబీర్సింగ్ చేస్తుండటంతో జెర్సీ వాయిదా పడింది. అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నాకోసం ఎంతో కాలం ఎదురుచూశారు. ఈ సందర్భంగా గౌతమ్కి నా ధన్యవాదాలు! ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతా! ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాల్లో జెర్సీ ది బెస్ట్ అని. జెర్సీ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ‘‘మనిషి చైతన్యానికి విజయం’’ అని చెబుతా
థియేటర్లలో విడుదల చేయాలని రెండేళ్లు ఆగాం..
ఈ టీమ్తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ కాలంలో ఈ సినిమాని 50శాతం పూర్తిచేశాం. వాక్సిన్ అందుబాటులో లేక కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో నాతో పాటు మానాన్న, కొడుకు ఉండేవారు. అన్ని అడ్డంకులు దాటుకొని వచ్చేసరికి.. ఇంత పెద్ద ప్రయాణంలా సాగింది. కుటుంబంతో కలిసి చూడాల్సిన కథ ఇది. అందుకే థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకే రెండేళ్లు నిరీక్షించాం. ఈవిషయంలో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్కి నా ధన్యవాదాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?