Kousalya: టాలీవుడ్‌ గాయనికి కరోనా పాజిటివ్‌..

‘శివమణి’, ‘దేశముదురు’, ‘సింహా’ వంటి చిత్రాలకు ప్లేబ్యా్‌క్‌ సింగర్‌గా వ్యవహరించిన గాయని కౌశల్య అనారోగ్యానికి గురయ్యారు. తాను కరోనా బారిన పడ్డానని తెలిపారు...

Published : 28 Jan 2022 12:42 IST

హైదరాబాద్‌: ‘శివమణి’, ‘దేశముదురు’, ‘సింహా’ వంటి చిత్రాలకు ప్లేబ్యాక్‌ సింగర్‌గా వ్యవహరించిన గాయని కౌశల్య అనారోగ్యానికి గురయ్యారు. తాను కరోనా బారిన పడ్డానని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇవి స్వల్ప లక్షణాలుగా అనిపించడం లేదు. ఎందుకంటే, రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. దానివల్ల కనీసం మంచంపై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ఇప్పుడు చూస్తే గొంతునొప్పి తీవ్రంగా బాధపెడుతోంది. బుధవారం నుంచి వైద్యుల సూచనలు పాటిస్తూ మాత్రలు తీసుకుంటున్నా. కరోనాతో పోరాటం చేసి త్వరలోనే మీ ముందుకు వస్తా. దయచేసి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి’’ అని కౌశల్య తెలిపారు. ఆమె పెట్టిన పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు.. ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అని రిప్లై ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని