శకుంతలాదేవి.. ది హ్యూమన్ కంప్యూటర్!
మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల........
మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు... విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్బుక్లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్గా సుపరిచితురాలైన శకుంతలాదేవి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. గణితంలోనే కాదు.. ఆమెకు జ్యోతిషంలోనూ పట్టుంది. రచయిత కూడా. పేరుకే హ్యూమన్ కంప్యూటర్ అయినా.. ఆమె సైతం సాధారణ మనిషి ఎదుర్కొన్న కష్టాలను అనుభవించారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆమె జీవితం కథా వస్తువైంది. త్వరలో ‘శకుంతలాదేవి’గా ముందుకు రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ శకుంతలాదేవి పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా జులై నెలాఖరులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
చదువుకోకపోయినా.. లెక్కల్లో మేటి
బెంగళూరులో 1929 నవంబర్ 4న సంప్రదాయ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు శకుంతలాదేవి. ఆచారాలు, కట్టుబాట్లను పక్కన పెట్టి ఆమె తండ్రి సర్కస్లో పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో పెరిగిన శకుంతలాదేవికి గణితమంటే మక్కువ. ఆ విషయాన్ని మూడేళ్ల ప్రాయంలోనే గుర్తించారు ఆమె తండ్రి. ఓ రోజు పేక ముక్కలతో ట్రిక్లో తండ్రినే ఓడించడంతో ఆమె ప్రతిభ బయటపడింది. అంకెలను గుర్తు పెట్టుకోవడంలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన తండ్రి.. సర్కస్ మానేసి ఆమె చేత గణిత ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఆ నోటా.. ఈ నోటా శకుంతాలా దేవి పేరు మార్మోగింది. ఏకంగా ఆరేళ్ల వయసులోనే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఆమె ఎదిగింది.
కంప్యూటర్తో పోటీ..
14 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి గణిత ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆమె లండన్ చేరుకున్నారు. అప్పటి నుంచి విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. అలా యూరప్, అమెరికా వంటి దేశాలను చుట్టొచ్చారు. సంప్రదాయ విద్యానభ్యసించకుండానే ఆమె ఇలా ప్రదర్శనలు ఇవ్వడం ఆమెకే చెల్లింది. ఈ క్రమంలో 1977లో టెక్సాస్ సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో ఒక ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. 201 అంకెలు కలిగిన ఒక సంఖ్యకు 23వ వర్గమూలాన్ని చకచకా చెప్పేశారు. కేవలం 50 సెకన్లలో గణించి ఆహూతుల్ని ఆశ్చర్యపోయేలా చేశారు. ఇది చేసేందుకు కంప్యూటర్కు 60 సెకన్లు తీసుకోవడం గమనార్హం. 1980లో జూన్ 18న లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన.. శకుంతలాదేవి జీవితంలో మైలురాయి. ప్రపంచానికి హ్యూమన్ కంప్యూటర్గా పరిచయమైంది ఆ రోజే. ఆ ప్రదర్శనలో అప్పటికప్పుడు కంప్యూటర్ ఇచ్చిన రెండు 13 అంకెలు కలిగిన సంఖ్యలను గుణించి కేవలం 28 సెకన్లలో సమాధానమిచ్చారు శకుంతలాదేవి. దీంతో ఆమె పేరు గిన్నిస్బుక్లో స్థానం సాధించింది. ఈ రికార్డు ఇప్పటికీ పదిలమే. కేవలం అంకెలు గణించడమే కాదు.. గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పగలరంటే ఆమె మేధస్సును అర్థం చేసుకోవచ్చు.
వైవాహికం.. ఓ పుస్తకం
1960లో కోల్కతాకు చెందిన పరితోష్ బెనర్జీ అనే ఐఏఎస్ అధికారిని శకుంతలా దేవి వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే ఆయన హోమో సెక్సువల్ అని తెలిసింది. కొద్దికాలానికే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఈ దంపతులకు కుమార్తె కూడా ఉన్నారు. హోమో సెక్సువల్ అయిన భర్తను దగ్గర నుంచి చూసిన ఆమె.. ఆ తర్వాతి కాలంలో ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పేరిట 1977లో ఓ పుస్తకం రాశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని అప్పట్లోనే తన పుస్తకం ద్వారా చెప్పాలనుకున్నారు. 2018లో సుప్రీంకోర్టు సైతం స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు వెలువరించడం గమనార్హం. ఇదే కాదు.. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు.
ఇందిరపై పోటీ
అత్యయిక స్థితి విధించడంపై ఆగ్రహించిన శకుంతలా దేవి.. ఏకంగా ఇందిరాగాంధీపైనే పోటీకి దిగారు. అదీ మెదక్ నుంచి కావడం గమనార్హం. 1980లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీతో పాటు మెదక్ నుంచీ ఇందిరా గాంధీ పోటీచేశారు. మెదక్ ప్రజలను మోసగించేందుకు గాంధీ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ ఆమెపై శకుంతలాదేవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మందిలో శకుంతలాదేవి 9వ స్థానంలో నిలిచారు. అవే ఎన్నికల్లో బొంబాయి సౌత్ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013లో ఏప్రిల్లో బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
వెండితెరపైకి..
ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత వెండితెరపై ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది. ‘శకుంతలా దేవి’ పేరుతో అను మేనన్ దీన్ని తెరకెక్కించారు. ఇటీవలే చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్లో బాల్యం నుంచి ఆమె ఎదిగిన క్రమాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులతో సరదాగా సాగిపోయే సన్నివేశాలు, గణిత ప్రదర్శనలు, తల్లీకూతుళ్ల మధ్య సాగే సన్నివేశాలు ఇందులో కనిపించాయి. శకుంతలాదేవి కుమార్తె పాత్రలో బాలీవుడ్ నాయిక సన్యా మల్హోత్ర కనిపించనున్నారు. వీరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ట్రైలర్లో ప్రధానంగా చూపించారు. దీనిబట్టి సాధారణ జనానికి తెలీని ఇంకో కోణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. శకుంతలాదేవి కుమార్తె అనుపమ బెనర్జీ కూడా ఈ చిత్రం స్క్రిప్ట్కు తోడ్పాటు అందించారు. ఆమె జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించారనేది చూడాలి మరి!!
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాఖీభాయ్ లుక్లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ