సన్నీ లియోనీని విచారించిన కేరళ పోలీసులు

: బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని కేరళ పోలీసులు విచారించారు. ఆర్థికనేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని నమ్మించి రూ.29 లక్షలు.........

Published : 07 Feb 2021 00:45 IST

తిరువనంతపురం: బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీని కేరళ పోలీసులు విచారించారు. ఆర్థికనేరానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనని నమ్మించి రూ.29 లక్షలు సన్నీ అక్రమంగా తీసుకున్నారంటూ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాస్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో కేసు విచారణ చేపట్టిన పోలీసులు సన్నీని విచారించారు. ఓ టెలివిజన్‌ షో నిమిత్తంగా తిరువనంతపురం జిల్లా పూవురుకు వచ్చిన ఆమెను ప్రశ్నించారు. రెండు కార్యక్రమాల్లో సన్నీ పాల్గొంటానని చెప్పి తన నుంచి రూ.29లక్షలు తీసుకుని ఆ తర్వాత మొహం చాటేశారని షియాస్‌ ఆరోపించాడు. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు.

ఇదీ చదవండి..

రూటు మార్చిన రామ్‌.. ‘స్టార్‌ మహిళ’లకు థ్యాంక్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని