Karthikeya: లోహిత.. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను: కార్తికేయ

కాబోయే సతీమణి లోహితపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు నటుడు కార్తికేయ. ఇటీవల ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్టేజ్‌పై అందరి ముందు లోహితకు ప్రపోజ్‌...

Updated : 08 Nov 2021 16:46 IST

హైదరాబాద్‌: కాబోయే సతీమణి లోహితపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు నటుడు కార్తికేయ. ఇటీవల ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్టేజ్‌పై అందరి ముందు లోహితకు ప్రపోజ్‌ చేసిన ఆ క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. తాజాగా ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ‘స్టేజ్‌పై అందరి ముందు నీకు ప్రపోజ్‌ చేసిన ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా హృదయంలో ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. ప్రియురాలిగా నాకు ఓ అందమైన ప్రయాణాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్యూ. నవంబర్‌ 21 నుంచి నువ్వు నా జీవిత భాగస్వామివి అవుతున్నావంటే నాకెంతో ఆనందంగా ఉంది. 2010లో మొదటిసారి నీతో మాట్లాడినప్పుడు నేను ఎంతలా సంతోషానికి గురయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్‌లో ఉన్నా’’ అని కార్తికేయ పేర్కొన్నారు.

బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ.. కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుని.. తన ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో కార్తికేయ-లోహితల నిశ్చితార్థం ఆగస్టు నెలలో వేడుకగా జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని