Puneet Rajkumar: పునీత్కి మాటిస్తున్నా.. ఇకపై ఆ చిన్నారుల్ని నేను చదివిస్తా: విశాల్
‘పునీత్ రాజ్కుమార్లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘పునీత్ రాజ్కుమార్లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. తను లేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఇంకా నా కళ్లలోనే మెదులుతున్నారు’ అని విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎనిమి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పునీత్కి నివాళులర్పించిన అనంతరం విశాల్ మాట్లాడారు. పునీత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఎనిమి’. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. మిని స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా పునీత్కి నివాళులర్పించి, ఆయన చేసిన సేవల్ని కొనియాడారు.
ఇకపై ఆ బాధ్యత నాది: విశాల్
పునీత్ రాజ్కుమార్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. మేకప్ ఉన్నా, మేకప్ తీసేసినా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎప్పుడూ ఒకేలా మాట్లాడేవారు. ఎంతోమందికి ఉచిత విద్యని అందించారు. వృద్ధాశ్రమాల్ని నడిపారు. ఇవే కాదు సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. ఇన్ని పనుల్ని ప్రభుత్వం చేసిందంటే నమ్మొచ్చు. కానీ, ఒక మనిషి చేశాడంటే నమ్మడం కష్టమే. చివరిగా తన కళ్లనీ దానం చేశారు. ఇప్పటి వరకూ చదివించిన 1800 మంది చిన్నారులని తన స్నేహితుడిగా నేను చదివిస్తానని పునీత్కి మాటిస్తున్నా. పునీత్ సేవా కార్యక్రమాలకి నా వంతు చేయూతనందిస్తా.
ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్ సర్ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్ యూ సర్’ అంటూ ఎమోషన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఆనంద్ శంకర్, కథానాయిక మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, నిర్మాత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి
ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ.. -
నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!
బాలీవుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు. -
యూట్యూబ్లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. -
రష్మిక యాక్టింగ్ సూపర్.. ఆ రోల్ కోసం తొలుత నన్నే అడిగారు: మాజీ ప్రపంచ సుందరి
తన సరికొత్త చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి మానుషి చిల్లర్ (Manushi Chhillar). -
గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్ పోస్ట్
నటుడు నాని (Nani) కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’ (Jersey). 2019లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. -
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
నటుడు రామ్చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) తాజాగా ఓ సరదా వీడియో షేర్ చేశారు. ఇందులో సురేఖ (చిరంజీవి సతీమణి) ఆవకాయ పడుతూ కనిపించారు. -
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
తన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెమెరామెన్ చోటా కె నాయుడిని ఉద్దేశిస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ లేఖ విడుదల చేశారు. -
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
సామాజిక మాధ్యమాల వేదికగా సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
నాలుగు క్యారవాన్లు ఇస్తే కానీ సెట్లోకి రారు : సెలబ్రిటీల తీరుపై దర్శకురాలు కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ తారలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకురాలు పరాఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్గా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి