Chay Sam: చై-సామ్‌ ప్రకటన.. నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖుష్బూ

టీటౌన్‌ లవ్లీ జోడీ నాగచైతన్య-సమంత విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమంతది తప్పని..

Published : 05 Oct 2021 01:51 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ లవ్లీ జోడీ నాగచైతన్య-సమంత విడిపోయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమంతది తప్పని.. మరికొంతమంది చైతన్యది తప్పు అంటూ వాళ్లకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలపై నటి ఖుష్బూ మండిపడ్డారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై మీరెలా తీర్పులిస్తారని వ్యాఖ్యానించారు.

‘ఒక జంట మధ్య ఏం జరిగినా.. అది వాళ్ల వ్యక్తిగతం. ఎందుకు విడిపోతున్నారనేది వాళ్లిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. వాళ్ల వ్యక్తిగత గోప్యతను మనం గౌరవించాలి. వాళ్ల కథకు ఒక ముగింపు ఇవ్వడం కోసం దయచేసి మీకిష్టం వచ్చినట్లు ఊహించుకోకండి’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు. కాగా, ఆమె చేసిన ట్వీట్‌పై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘నటీమణులకు ఇలా జరగాల్సిందే. ఎందుకంటే డబ్బు, స్టార్‌హోదా లేకుండా సాధారణ గృహిణిలా వాళ్లు బతకలేరు. ఒక సాధారణ యువకుడ్ని వాళ్లేందుకు పెళ్లి చేసుకోరు?జీవితం కంటే డబ్బు, పరపతి ముఖ్యమా?’అని ప్రశ్నించాడు.

సదరు వ్యాఖ్యలపై ఆగ్రహానికి లోనైన ఆమె.. నెటిజన్‌పై మండిపడ్డారు. ‘నటీమణులకు ఇలాగే కావాలంటూ నువ్వు చేసిన వ్యాఖ్యల్లోనే అర్థమవుతోంది నీ మానసిక పరిస్థితి. నటీమణుల గురించి నీకు ఏం తెలుసు? వాళ్ల జీవితాల గురించి కామెంట్ చేసే అర్హత నీకు ఎక్కడిది? పబ్లిక్‌ ఫిగర్‌ అంటే పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు’ అని ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని