Adbhutham: కొత్తదనమే నచ్చింది

ప్రేక్షకుల నుంచి మా సినిమాకి వస్తున్న స్పందన నిజంగానే ఓ అద్భుతంలా ఉందన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల. ఆయన నిర్మాణంలో తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం

Updated : 25 Nov 2021 09:01 IST

ప్రేక్షకుల నుంచి మా సినిమాకి వస్తున్న స్పందన నిజంగానే ఓ అద్భుతంలా ఉందన్నారు చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల. ఆయన నిర్మాణంలో తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అద్భుతం’. రామ్‌ మల్లిక్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఓటీటీ వేదికలో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి చిత్రానికి లభిస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ విలేకర్లతో మాట్లాడారు. ‘‘కథలో కొత్తదనం, ఊహల్ని తలకిందులు చేస్తూ సాగే కథనం ప్రేక్షకులకు బాగా నచ్చింది. 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో ఫిట్‌నెస్‌ స్టూడియో స్థాపించా. అలా నాకూ పెరిగిన ఆసక్తితోనే ఈ సినిమా నిర్మించా. తేజ, శివాని జోడీ, వారి నటన చాలా బాగా కుదిరింది. థియేటర్లు ప్రారంభం కావేమో అని ముందే డిస్నీ హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుని అక్కడ సినిమాని విడుదల చేశాం. ప్రేక్షకుల స్పందన ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. తదుపరి కుటుంబ బంధాలపై సినిమా చేయనున్నాం’’ అన్నారు.
 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని