Prithviraj: అందరూ సిద్ధం కండి.. హిందూస్థాన్‌ షేర్‌ వస్తోంది

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ జోరు కొనసాగుతోంది. ఇటీవలే ‘సూర్యవంశీ’ హిట్‌ అందుకున్న అక్షయ్‌.. ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్‌ డ్రామా...

Published : 15 Nov 2021 14:42 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ జోరు కొనసాగుతోంది. ఇటీవలే ‘సూర్యవంశీ’తో హిట్‌ అందుకున్న అక్షయ్‌.. ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్‌ డ్రామా ‘పృథ్వీరాజ్‌’. చౌహాన్‌ రాజవంశానికి చెందిన రాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘సలామ్‌ చేయడానికి అందరూ సిద్ధం కండి. హిందూస్థాన్‌ సింహం వచ్చేస్తోంది’’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ టీజర్‌ ద్వారా సినిమాలో కీలక పాత్రధారుల్ని పరిచయం చేసింది. ఇందులో అక్షయ్‌కు జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్‌ సందడి చేయనున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని