Cinema News: స్పందించాలని చెప్పే... ‘భగత్‌సింగ్‌ నగర్‌’

విధార్థ్‌, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగత్‌సింగ్‌ నగర్‌’. వాలాజాగౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మించారు.

Updated : 25 Nov 2021 08:58 IST

విధార్థ్‌, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగత్‌సింగ్‌ నగర్‌’. వాలాజాగౌరి, రమేష్‌ ఉడత్తు నిర్మించారు. ఈ   నెల 26న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. టి.ప్రసన్నకుమార్‌, రమణారావు, చంద్రమహేష్‌, బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎంతోమంది   దర్శకుల స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించా’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘మన కళ్ల ముందు ఏదైనా సంఘటన జరిగినా ఎలాంటి స్పందన లేకుండా, మనం, మన కుటుంబం బాగుంటే చాలని చూస్తూ వెళ్లిపోతున్నాం. సాంకేతికత వల్ల ప్రతీ విషయానికీ ఆన్‌లైన్‌లోనే స్పందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తుకి ఎంతో ప్రమాదం. మనమంతా మనుషులం, స్పందించాలని    చెప్పే ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు.
 
 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని