Bullettu Bandi: బుల్లెట్ బండి.. ఇలా వైరలైందండి..!
‘నువ్వు బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తావా.. అందాల ధునియానే చూపిస్తావా’ అంటూ ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి...
నవ వధువు డ్యాన్స్తో విపరీతమైన క్రేజ్
హైదరాబాద్: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా’ అంటూ ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్ప్రైజ్ చేసేందుకు బరాత్లో ‘బుల్లెట్టు బండి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్గా మారడం.. సాయి దంపతులకు ఫుల్ క్రేజ్ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. మరి, ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ‘బుల్లెట్టు బండి’ పాట పాడిందెవరు? ఒరిజినల్ సాంగ్ ఎలా ఉంటుంది? అనేది ఒక్కసారి తెలుసుకుందాం..!
బుల్లెట్టు బండి.. మన మోహనదేనండి..!
‘బుల్లెట్టు బండి’ ఒరిజినల్ పాట ఆలపించింది మన తెలుగింటి అమ్మాయి మోహన భోగరాజు. సంగీతంపై ఉన్న ఆసక్తి.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆమె ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎదురుచూసిన మోహన ప్రస్తుతం వరుస పాటలతో అందర్నీ కట్టిపడేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. ‘బాహుబలి’లో ‘మనోహరి’, ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్ సాంగ్, ‘అరవింద సమేత’లో ‘రెడ్డమ్మ తల్లి’తోపాటు ఇటీవల వచ్చిన ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఓ వైపు సినిమా పాటలతో అలరిస్తూనే సమయం దొరికినప్పుడల్లా ప్రైవేటు ఆల్బమ్స్ క్రియేట్ చేయడం మోహన అభిరుచి. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆమె ‘బుల్లెట్ బండి’ ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు. లక్ష్మణ్ ఈ పాట రాశారు. మోహన కేవలం పాట పాడడమే కాకుండా దానికి అనువుగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇప్పటి వరకూ ఈ పాటను 3.7 కోట్ల మంది వీక్షించారు. అయితే, ఒరిజినల్ వీడియో కంటే ఇటీవల నవవధువు సాయి చేసిన డ్యాన్స్ వీడియో వైరలయ్యాకే ఈ పాటకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఈ పాటకు సోషల్మీడియా కవర్ సాంగ్స్ వరుస కట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత