Tollywood: మిత్ర చిత్రం..స్నేహ ఛత్రం.. స్నేహం ప్రధానంగా తెరకెక్కుతోన్న చిత్రాలివే
నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తనే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకి పగటిని చూపిస్తాడు’’ - అసలు ‘మన ఫ్రెండల్లే ఎవడుంటాడు?’ అంటూ ఓ మంచి స్నేహితుడి గురించి గొప్పగా వర్ణించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి ....
నేడు స్నేహితుల దినోత్సవం
‘‘నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తనే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కోనీడు మన కలలకి పగటిని చూపిస్తాడు’’ - అసలు ‘మన ఫ్రెండల్లే ఎవడుంటాడు?’ అంటూ ఓ మంచి స్నేహితుడి గురించి గొప్పగా వర్ణించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం. ‘ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రంరా స్నేహం’ అంటూ భువనచంద్ర రాసిన స్నేహగీతాన్ని ఎప్పటికీ పాడుకుంటూనే ఉంటాం.
‘ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేన’ అంటూ వనమాలి, ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే’ అంటూ చంద్రబోస్. ‘స్నేహమంటే ఏమిటంటే..? పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట..
వద్దు అంటే వెళ్లదంట కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తేనంట’ అంటూ శ్రీమణి... ఇలా ఎంతోమంది కవులు స్నేహాన్ని, అందులోని గొప్పదనాన్ని తమ పాటల్లో ఆవిష్కరిస్తూనే ఉన్నారు.
రెండక్షరాల స్నేహం.. తన గురించి, తన లోతు గురించి చెప్పడానికి మరెన్నో పాటలు, మరెన్నో కథలు మిగిలే ఉన్నాయని నిరూపిస్తోంది. అసలు స్నేహం... ప్రేమని స్పృశించని చిత్రాలు అరుదు అనే చెప్పాలి. కొన్ని చిత్రాలు మాత్రం స్నేహమే ప్రధానంగా రూపొందుతుంటాయి. ‘స్నేహంకోసం’, ‘ఇద్దరు మిత్రులు’, ‘స్నేహితులు’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘ఓ మై ఫ్రెండ్’, ‘నీ స్నేహం’... ఇలా ఎన్నో చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ‘వసంతం’, ‘మహర్షి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఎవడే సుబ్రమణ్యం?’, ‘టైగర్’ తదితర చిత్రాల్లోనూ స్నేహం గొప్పతనం కనిపిస్తుంది. ఇప్పుడూ కొన్ని చిత్రాలు స్నేహం ప్రధానంగా రూపొందుతున్నాయి.
‘ఆర్.ఆర్.ఆర్’ దోస్తీ
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం కథానాయకులు ఎన్టీఆర్, రామ్చరణ్ స్నేహహస్తం చాటారు. ఒకరు కొమరం భీమ్, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రాజమౌళి స్నేహబంధాన్ని బలంగా ఆవిష్కరించారని సమాచారం. స్నేహం ప్రధానంగా సాగే ‘దోస్తీ...’ అనే పాట ఆదివారం విడుదలవుతోంది. మిత్రులైన అగ్ర కథానాయకుల మధ్య... అందునా నిజ జీవిత కథానాయకుల పాత్రల్లోనే కనిపించే ఆ ఇద్దరి మధ్య స్నేహబంధం అంటే కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించే అంశమే. మరి ఆ బంధం నేపథ్యంలో జక్కన్న పండించిన భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
శత్రువుల్లా..?
తెరపైనే కాదు... నిజ జీవితంలోనూ కథానాయకులు మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు వారు. దక్షిణాది కథానాయకుల్లో స్నేహితుల జాబితానే తీస్తే తొలి వరసలో కనిపించే ద్వయం విశాల్ - ఆర్య. ఈ ఇద్దరూ కలిసి ‘ఎనిమి’ అనే సినిమా చేస్తున్నారు. స్నేహితులు కాస్త శత్రువులయ్యారన్నమాట. మరి ఈ స్నేహం, శత్రుత్వం వెనక సంగతులేమిటనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా... నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే...’ అనే డైలాగ్తో ఇటీవల టీజర్ విడుదలైంది. స్నేహంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ సినిమా రూపొందుతోందని స్పష్టమవుతోంది.
‘మహా...’ స్నేహితులు
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా రూపొందుతున్న ‘మహాసముద్రం’లోనూ ఇద్దరు స్నేహితులు కనిపిస్తారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా స్నేహం, ప్రేమ చుట్టూ సాగుతుందని... కథానాయకులిద్దరూ స్నేహితులుగా సందడి చేస్తారని తెలిసింది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా